దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని శిక్షలు అమలు చేసినా ఈ దారుణాలు ఆగడం లేదు. చిన్నారులపై కూడా అఘాయిత్యాలు జరగడం సమాజంలో తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ప్రభుత్వాలు కఠిన చట్టాలే కాదు.. స్త్రీలను గౌరవిద్దాం అంటూ ఎన్నో అవగాహనా కార్యక్రమాలు చేపడుతోంది. కానీ.. ఎన్ని చేసినా దేశంలో మహిళలపై పెరుగుతున్న దాడులు ప్రభుత్వాలనే కాదు.. సామాన్యులకు కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలిసులు మహిళల రక్షణకు మరో వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇందుకు సినీ నేపథ్యాన్ని, ట్విట్టర్ మాధ్యమాన్ని ఎంచుకున్నారు.
ఈ ఏడాది సంక్రాంతికి అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా ఏస్థాయి హిట్ అయిందో తెలిసిన విషయమే. సంచలన విజయం సాధించిన ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని తీసుకుని మహిళల రక్షణకు తమ వంతుగా అవగాహన కల్పించారు. సినిమాలోని ఓ సన్నివేశంలో హీరోయిన్ పూజా హేగ్డేను బ్రహ్మాజీ బెదిరిస్తాడు. ఆ సమయంలో హీరో అల్లు అర్జున్ ఫైట్ చేసిన తర్వాత బ్రహ్మాజీతో ఓ డైలాగ్ చెప్తాడు. ‘ముఖ్యంగా.. అందులోనూ ప్రధానంగా ఒక స్త్రీ వద్దు.. అని అంటే మాత్రం దాని అర్ధం.. అస్సలు వద్దని’ అని అంటాడు. ఈ డైలాగ్ అప్పట్లోనే అందరినీ ఆలోచింపజేసింది. ఇప్పుడీ డైలాగ్ నే హైదరాబాద్ సిటీ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
‘మహిళలను గౌరవించండి. ఎందుకంటే ఒక జెంటిల్ మెన్ గా మహిళలకు గౌరవించుకోవడం మన విధి’ అంటూ తమ వాల్ లో రాశారు. సినిమా మాధ్యమం అందరికీ ఇష్టమైంది. ఆ విధంగానే హైదరాబాద్ పోలీసులు ఇలా వినూత్నంగా ఆలోచించారని చెప్పాలి. దేశంలో మహిళలపై జరుగుతున్న దారుణాలపై, సమకాలీన సమాజంపై ఈ సినిమా దర్శక, రచయిత త్రివిక్రమ్ రాసిన డైలాగ్ ఇది. ప్రస్తుతం ఈ ట్వీట్ కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘మహిళలను మనందరం కాపాడుకోవాలి.. ఇది మన బాధ్యత’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#RespectWomen #StopCrimesAgainstWomen
Respect women not because she is a woman but because you are a #Gentleman pic.twitter.com/kmlOOyNT7t— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) November 17, 2020
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!