(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కరోనా నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో 50 శాతం జీతాల చెల్లింపుపై ఏపి ప్రభుత్వం జివో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏపి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ జీవోను కొట్టేస్తూ బకాయిలను 12 శాతం వడ్డీతో రెండు నెలల్లోగా చెల్లించాలని ఆగస్టు నెలలో ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై బుధవారం సుప్రీం కోర్టులో న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కరోనా సంక్షోభంతో ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదనీ, వడ్డీ చెల్లించలేమనీ ప్రభుత్వం సుప్రీం ధర్మాసనానికి విన్నవించింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలకు ధర్మాసనం సంతృప్తి చెందింది. 12 శాతం వడ్డీ చెల్లించాలన్న హైకోర్టు ఉదేశాలపై సుప్రీం ధర్మాసనం స్టే విధిస్తూ విచారణను వాయిదా వేసింది.