Intinti Gruhalakshmi: అభి ఆలస్యంగా ఇంటికి రావడం చూసిన తులసి ఇంత లేట్ అయ్యిందని అడుగుతుంది.. హాస్పటల్ లో సర్జరీ చేసి లేట్ అయ్యిందని చెప్పగా.. ఇంటికి మాధవి అత్తయ్య వచ్చిందని వరుసగా బాంబ్స్ పెలుస్తుంది.. ఏంటి అంత కంగారు పడుతున్నావ్ అంటూ అభి నుంచి నిజం తెలుసుకునే ప్రయత్నం చేయగా అభి నిద్రవస్తుంది అంటూ తెలివిగా తప్పించుకుంటాడు..!!
545 ఎపిసోడ్ హైలైట్స్..
భాగ్య వచ్చి లాస్యను పలకరించగా.. లాస్య ఏం మాట్లాడక పోయేసరికి అంతేలే అవసరం తిరిపోయక ఏం మాట్లాడతావు అంటూ దెప్పిపొడుస్తుంది. నందు తన మాట వినకుండా తులసి మాట వింటున్నాడని చెబుతుంది. ఇక భాగ్య ఇంట్లో వాళ్లందరినీ విడగొడితే నువ్వు అనుకున్నది జరుగుతుందని చెబుతుంది. ఈ ఇంటికి నువ్వే మహారాణి వి కావచ్చు అని చెబుతుంది. ఇది కూడా కరెక్ట్ అనిపించి ఎలా విడగొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది..
Read More: Devatha Serial: దేవిని ఆదిత్యతో మాట్లాడక పోవడానికి రాధ కారణమని తెలిసి ఏం చేశాడంటే..!?
తులసి అంకిత ను వంటింట్లోకి ఎందుకు వచ్చావు అని ప్రశ్నిస్తుంది. అంకిత వంటింట్లోకి నన్ను రానివ్వక పోతే ధర్నా చేస్తాను అనగా.. తులసి జాబ్ రాగానే అత్తయ్య ను ఎదిరించే ధైర్యం వచ్చేసిందా అని అంటుంది.. అని అనగానే అంకిత పేరుకి కోడలిని అయిన నన్ను కూతురిలా చూసుకుంటున్నారు. అలా అయితే నీ కొత్త జాబ్ కు అవసరమైన స్కిల్స్ పెంచుకోమని చెబుతుంది.. నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎదురొన్న సమస్యలు నా కోడలు పడకూడదు అని చెబుతుంది. అంతలో అంకిత భర్త కోసం కాదు మంచి అత్తగారు దొరకలని పూజ చేయాలని అనగానే.. తులసి బాధపడుతూ అన్ని మనకు నచ్చినట్టు జరగవు. మన అదృష్టాన్ని మనకు నచ్చినట్టుగా మార్చుకోవాలని చెబుతుంది. మరి మీరు ఎందుకు అంకుల్ విషయంలో ఎందుకు అలా చేయలేకపోయారు అని అంకిత అడుగుతుంది. ఎందుకు మీకు అనుకూలంగా మార్చుకోలేదు.. మీ అంకుల్ నాతో ప్రేమగా ఉండక పోయినా ఆయనతో కలిసి ఉండాలి అనుకునాన్ను.. ఆయన మనసులో మరో మనిషి ఉందని తెలుసుకున్నకా.. కాస్త అపేక్ష కావాలని అనుకున్నా అది కూడా దొరకనప్పుడు ఆత్మాభిమానం చంపుకొని బ్రతకడం కంటే చావడం మేలనిపించింది అంటూ తులసి బాధపడుతుండగా.. అంకిత సారీ ఆంటీ గతం గుర్తుచేసి బాధపెట్టాను అంటుంది. నువ్వు గుర్తుచేసేది ఏముందమ్మ మీ అంకుల్ రూపంలో ప్రతిరోజు నాకు కనిపిస్తుందికదా.. అంటూ శ్రుతి కనిపించలేదు అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తుంది.
ఇక అంకిత అభి ఆఫీస్ కి వెళ్తుండగా నువ్వు నిన్న హాస్పిటల్ కు వెళ్ళలేదా అని ఆభిని నిలదీస్తుంది. ఆపరేషన్ చేశాక మరో ఇంటర్వ్యూ కి వెళ్ళా అంటూ కవర్ చేస్తాడు. అంతలో నందు, లాస్య అభీకి సపోర్ట్ గా మాట్లాడతారు. దాంతో అందరి ముందు అభి పరువు తియ్యడం ఇష్టంలేక సైలెంట్ గా ఉండి పోతుంది. ఇక ఆఫీస్ కి వెళ్లోచిన అంకిత తన వంట ప్రావీణ్యం చూపించగా చపాతీ మాడి, టీ అదోరకంగా ఉంటుంది. అదే విషయాన్ని పరంధామయ్య అనసూయ చెప్పగా.. ఏదో నేర్చుకుని చేస్తున్నాగా మెచ్చుకొక పోగా.. తులసి ఆంటీ తో తనని కంపేర్ చేస్తారెంటి అంటూ రివర్స్ అవుతుంది.. అంతలో తులసి వస్తుంది మిగతావి తరువాయి భాగంలో తెలుసుకుందాం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!