Radhe shyam: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా విషయంలో ఏ అప్డేట్ ఇచ్చినా సోషల్ మీడియాలో ..ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ అవుతోంది. ఇది పీరియాడికల్ లవ్ స్టోరి అని అందరికీ తెలిసిందే. జిల్ సినిమాతో హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రభాస్ సరసన నటిస్తోంది. పామిస్ట్గా మొదటిసారి ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నారు ప్రభాస్. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. గోపికృష్ణ మూవీస్, టీ సిరీస్ కలిసి ఈ సినిమాను సమర్పిస్తున్నాయి.
ఇక ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో మార్చ్ 11వ తేదీన 7 భాషలలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం అన్నీ రకాలుగా సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రభాస్ టీమ్ గ్రాండ్ థీమ్ పార్టీ జరపబోతున్నారు. ఇప్పటికే సినిమాలో వేసిన ఈ భారీ సెట్ను ఈ పార్టీ కోసం ఇప్పుడు వేస్తున్నారు. రాధే శ్యామ్ సినిమా థీమ్ మొత్తం ఈ సెట్ ద్వారా తెలియజేయనున్నారు. దీనితో ఇప్పటి వరకు సినిమా మీద ఉన్న అంచనాలను మరో రేంజ్లో పెంచబోతున్నారు. ఇదే స్పెషల్ అని అందరూ ఇన్ని రోజులు భావించారు. కానీ, అంతకు మించి అనేట్టుగా ఓ సాలీడ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Radhe shyam: రాధే శ్యామ్ సినిమా రిలీజ్ తర్వాత చాలా గొప్పగా చెప్పుకుంటారు.
అదేమిటంటే..ఇంతక ముందు అన్నీ భాషలలో థియేట్రికల్ ట్రైలర్ ఈవెంట్ను అభిమానుల, టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఎంత ఘనంగా నిర్వహించారో.. అంతకంటే ఘనంగా దాదాపు టాలీవుడ్ సినీ ప్రముఖులందరూ గ్రాండ్గా ఫిబ్రవరి 14న నిర్వహించబోయో థిమ్ పార్టీకి ఆహ్వానించబోతున్నారట మేకర్స్. ఇదొక చరిత్రగా నిలవడం ఖాయమని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి రాధే శ్యామ్ థీమ్ పార్టీకి టాలీవుడ్ నుంచి ఎవరెవరు రానున్నారో.. ఎంతమంది సందడి చేయనున్నారో. కాగా, విక్రమాదిత్య, ప్రేరణ పాత్రల్లో నటించిన ప్రభాస్, పూజా హెగ్డేల గురించి రాధే శ్యామ్ సినిమా రిలీజ్ తర్వాత చాలా గొప్పగా చెప్పుకుంటారని మేకర్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!