Raviteja: మాస్ మహారాజా ఓ క్రేజీ ప్రాజెక్ట్ను వదిలేశాడని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకి మన మాస్ మహారాజ వదిలేసిన ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏదీ అంటే..తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘విక్రమ్ వేద’. ఈ సూపర్ హిట్ సినిమాలో స్టార్ హీరోలు మాధవన్ – విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగులోనూ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ప్రయత్నాలు జోరుగా సాగాయి. ఈ నేపథ్యంలోనే మాస్ మహారాజ వేద పాత్రలో నటించేందుకు ఎంతగానో ఆసక్తి చూపించారు.
ఇక యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాను బాగా డీల్ చేస్తాడని దర్శకుడిగా అవకాశం కూడా ఇచ్చారు. అయితే, విక్రమ్ పాత్రలో నటించడానికి అంతే పవర్ ఫుల్ హీరో ఉండాలి. అందుకే దర్శకుడు సుధీర్ వర్మ చాలామంది టాలీవుడ్ హీరోలను అనుకున్నాడు. వారిని కలిసి కథను నరేట్ చేశాడట. అయితే, వాళ్లంందరూ వేద పాత్రలో నటించడానికే రెడీ అయ్యారట గానీ విక్రమ్ పాత్ర చేయడానికి మాత్రం అంతగా ఆసక్తి చూపించలేదట. దాంతో విక్రమ్ వేద తెలుగు రీమేక్ హోల్డ్లో పడిపోయింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ కూడా మాతృక నిర్మాత శశికాంత్ ఎవరికీ ఇవ్వలేదు. తెలుగులోనూ తానే రీమేక్ చేయాలని భావించారు.
Raviteja: ఇది కూడా ఓ కారణం అయ్యుండొచ్చునని చెప్పుకుంటున్నారు.
కాగా, ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. హీరోలుగా బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్ – సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్కు దర్శకత్వం వహించిన పుష్పకర్-గాయత్రి దంపతులే హిందీలో కూడా రూపొందిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విక్రమ్ వేద హిందీ రీమేక్ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఇక తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేసే ఆలోచనను దాదాపు విరమించుకున్నట్టే అని టాక్ వినిపిస్తోంది. రవితేజ ప్రస్తుతం చిరంజీవితో కలిసి చేస్తున్న సినిమాతో కలిపి 6 చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఇది కూడా విక్రమ్ వేద తెలుగు రీమేక్ ఆలస్యం కావడానికి ఓ కారణం అయ్యుండొచ్చునని చెప్పుకుంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!