RRR: దేశంలో మరియు ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేమికులు “RRR” కోసం వెయిట్ చేస్తున్నారు. మార్చి 25 వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. బాహుబలి లాంటి చరిత్ర సృష్టించిన సినిమా తెరకెక్కించిన దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. “RRR” అత్యంత భారీ బడ్జెట్ సినిమా. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధర విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల.. ఇటీవల ఇబ్బందులు తలెత్తడంతో రాజమౌళి మరియు నిర్మాత డి.వి.వి.దానయ్య నిన్న సీఎం వైఎస్ జగన్ తో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ కావడం తెలిసిందే.
భేటీ అనంతరం రాజమౌళి సీఎం జగన్ చాలా పాజిటివ్ గా స్పందించారని.. బాగా రిసీవ్ చేసుకోవడం జరిగిందని.. మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా నేడు జగన్ ప్రభుత్వం “RRR” సినిమా కి గుడ్ న్యూస్ తెలిపింది. మేటర్ లోకి వెళ్తే “RRR” సినిమా టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ సినిమా టిక్కెట్ ధర రూ. 100 వరకు పెరిగే అవకాశం ఉంది. అంతమాత్రమే కాదు సినిమా బెనిఫిట్ షోలు వేసుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.
అత్యంత భారీ బడ్జెట్ సినిమా కావడంతో తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల “RRR” సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. దీంతో ఇప్పటి నుండి ప్రమోషన్ కార్యక్రమాలు మరింతగా స్పీడ్ పెంచాలన్ని సినిమా యూనిట్ రెడీ అయింది. అదే సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా ప్రీ రిలీజ్ వేడుక జరగలేదు గనుక… ఈ వేడుకను భారీ ఎత్తున చేయాలనే ఆలోచనలు సినిమా యూనిట్ ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!