Janhvi Kapoor : అలనాటి అందాల తార… అతిలోక సుందరి గురించి సినీ పరిశ్రమ ఇప్పుడే మరిచిపోదు. తన అందం, నటన ద్వారా దేశం మొత్తం పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఈ అతిలోక సుందరి ముద్దుల తనయ జాహ్నవి కపూర్. శ్రీదేవి గారాలపట్టి జాహ్నవి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో “గుడ్ లక్ జర్నీ”అనే సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జాహ్నవి కపూర్ తెలుగులో అరంగ్రేటం చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అనే సమాచారం వినబడుతుంది.
జాహ్నవి కపూర్ తెలుగులో ఓ ప్రముఖ దర్శకుడు సినిమాలో చేయడానికి ఒప్పుకున్నట్లు అధికారిక సమాచారం వినబడుతోంది. తెలుగులో ఆ డైరెక్టర్ ఎంతో విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించే క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. తాను సినిమా తెరకెక్కించాలంటే కథ విషయంలో అంత ఈజీగా ఒప్పుకోడు.ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆ దర్శకుడు డబ్బు మీద వ్యామోహంతో సినిమా తర్వాత సినిమాలు చేయకుండా ఎంతో విభిన్న కథలను ఎంచుకుని సినిమాను తెరకెక్కిస్తున్న మంచి దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు చెప్పిన కథ విన్న బోనీ కపూర్ కూడా తన కూతురు జాన్వి కపూర్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ఇదే అనువైన సమయం అని భావించారనీ తెలుస్తుంది.
జాన్వీ కపూర్ కు అక్కడ క్రేజ్ ఎక్కువ అంటున్న బోనీకపూర్: Janhvi Kapoor
ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయ్యేవి.కానీ బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా గొప్పతనం దేశం మొత్తం వ్యాపించడంతో ప్రస్తుతం తెలుగు సినిమాలన్ని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కడం వల్ల దేశం మొత్తం పేరుప్రఖ్యాతులను సంపాదించుకుంటాయి. తెలుగు సినిమాలు ఎంతో క్రేజ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే బోనికపూర్ తన కూతురును తెలుగు తెరకు పరిచయం చేయడం వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీలో కన్నా తెలుగు ఇండస్ట్రీ ద్వారానే తన క్రేజ్ ఎక్కువ అవుతుందని భావించారు. అయితే జాన్వీకపూర్ తెలుగులో చేయబోయే సినిమా ఏమిటి? ఆ దర్శకుడు ఎవరు? అనే విషయాల గురించి మరి కొంత సమాచారాన్ని త్వరలోనే తెలియనున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!