KIM BIDEN: ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ప్రస్తుతం ఉత్తర కొరియాలో విలయతాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రారంభంలో ఉత్తర కొరియా ఈ మహమ్మారి విషయంలో చాలా ఆంక్షలు విధించడం జరిగింది. అక్కడి అధ్యక్షుడు కిమ్… అంతర్జాతీయ విమానాల రాకపోకలు విషయంలో ముందుగానే అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ సరిహద్దులను క్లోజ్ చేసేసారు. ఇదే సమయంలో ఉత్తర కొరియాలో ఎవరికైనా కరోనా సోకితే కఠినంగా శిక్షలు ఉంటాయని… పలు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దీంతో ప్రారంభంలో ఉత్తరకొరియాలో పెద్దగా కరోనా ప్రభావం చూపలేదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పాటు పలు దేశాలలో కరోనా సాధారణ స్థితికి చేరుకున్న సమయంలో… ఉత్తర కొరియాలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరగటం సంచలనంగా మారింది. దాదాపు రోజుకి రెండు లక్షలకు పైగానే కొత్త కేసులు నమోదు అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మిగతా ప్రపంచ దేశాలను సహాయం కోరే పరిస్థితికి చేరుకున్నాడు. మొదటి నుండి నియంతగా పేరొందిన కిమ్… ఈ మహమ్మారి కరోనా విషయంలో గడగడలాడు తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటువంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. కిమ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కిమ్ నిజాయితీగా వ్యవహరిస్తే ఆయనని కలవటానికి సిద్దంగా ఉన్నట్లు జో బైడెన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు కరోనాతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా కి సాయం చేయడానికి ముందుకు వస్తామని టీకాలు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఉత్తర కొరియా నుండి ఎటువంటి స్పందన లేదని తెలిపారు. జో బైడెన్ ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్ యోల్ తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో ఇరువురు నేతలు మాట్లాడారు. ఇటువంటి కష్ట సమయంలో ఉత్తరకొరియా కి సహాయం చేసేలా అంతర్జాతీయ సంస్థలతో కలసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!