తెలుగునాట లక్ష్మీ కల్యాణంతో తన ప్రస్థానం మొదలైంది. మగధీరతో చెరగని ముద్ర వేసుకుంది. చందమామతో అలరించింది. ఇలా ఎన్ని చెప్పుకున్నా.. తక్కువే తన గురించి. యువత గుండెల్లో చెరగని ముద్ర వేసిన అందల తార, అభినయానికి మారుపేరైన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ చందమామ పెళ్లి శుక్రవారం ముంబైలో ఘనంగా జరిగింది. సమాజిక దూరం నిబంధనలను పాటిస్తూ అతి తక్కువ మంది సమక్షంలో తన ప్రియుడిని మనువాడింది ఈ మిత్రవింద.
శుక్రవారం బిజిబిజిగా ఉన్న ఈ కత్తిలాంటి చిన్నది శనివారం తన పెళ్లి ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అలాగే పెళ్లి చేసుకున్న విధానం, పెళ్లిగురించి ఈ చందమామ చెప్పిన మాటాలు ఇప్పుడు అందరిని ఆకర్శిస్తూ.. ట్రెండ్ అవుతున్నాయి. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో అభిమానులు ఉన్నారు. అలాగే బాలివుడ్ లో కూడా కాజల్ అప్పుడప్పుడు మెరిసింది. ఎప్పుడెప్పుడా అంటు పుకార్లను షికార్ల చేసే వాళ్ల నోర్లను సైలెంట్ గా మూయించింది.
అయితే ఈ పెళ్లికి సంబంధించి షేర్ చేసిన ఫొటోలో ఒకటి జీలకర్ర- బెల్లంది. అచ్చతెలుగు సప్రదాయం అయిన ఈ పద్దతిని కూడా తను ఆచరిస్తున్నట్టు తెలిపింది. “పంజాబీ వచ్చి కశ్మీరీని పెళ్లి చేసుకుంది. ఇందులో మేము తెలుగు సంప్రదాయమైన జీలకర్ర-బెల్లాన్ని కూడా కలిపేసాం” అంటూ తెలుగు వారిమీద తనకున్న ప్రేమని మరోసారి బయటపెట్టింది. తనకు తన ప్రియుడు గౌతమ్ కిచ్లూకు దక్షిణాదితో ఎంతో అనుబంధం ఉందని తెలిపింది.
జీలకర్ర- బెల్లం గురించి మాట్లాడుతూ.. జీలకర్ర-బెల్లాన్ని కలిపి మిశ్రమాన్ని తమలపాకు మీద ఉంచి సుముహూర్తం సమయంలో వేద మంత్రల నడుమ వధూవరులు ఒకరి తలపై మరొకరూ వీటిని పెట్టుకుంటారని చెప్పింది. ఇలా పెట్టుకున్న తరువాతే ఒకరిని ఒకరూ చూసుకుంటారని తెలిపింది కాజల్. ఇది కష్ట సుఖాల్లో, సుఖ దుఃఖాల్లో ఎప్పుడూ కలిసే ఉండాలని జీలకర్ర-బెల్లం చెబుతుందని ఈ ముద్దుగుమ్మ తన ఫీలింగ్స్ ని చేర్ చేసుకుంది.
స్నేహితుడు, చెలికాడు, నమ్మకస్తుడైన గౌతమ్ తో తన పెళ్లి జరిగిందని తెలిపింది. మిస్ కాజల్ ఇప్పుడు మిస్సెస్ కాజల్ అయ్యిందని తెలిపింది. నాకు కావలసినవన్నీ గౌతమ్ లో దొరకడం సంతోషంగా ఉందని మరో ఫొటోను షేర్ చేసింది ఈ మిత్రవింద.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!