గుడ్లల్లో పోషకాలు ఎక్కువ ధర తక్కువ అనే నాడికి మీకు గుర్తు ఉండే ఉంటుంది. నిజమే ఎగ్స్లో ఉంటే పోషక విలువలు చాలా అధికంగానే ఉంటాయి మరి ! అందుకే గుండ్లను రోజు ఆహారంలో తీసుకున్న ఏలాంటి సమస్యలు రాకపోగా.. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందనీ.. వీటిని అధికంగానే తీసుకోవచ్చునని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, ఎగ్ కాంభినేషన్గా ఈ నూనేను తీసుకుంటే బరువుకు కూడా సులభంగా తగ్గుతారని తాజా అధ్యయనం వెల్లడించింది.
ఈ నూనేతో పాటు మరిన్ని పదర్థాలతో కలిపి గుడ్లను ఆహరంగా తీసుకోవడంతో మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. మరీ గుడ్లతో కలిగే ఆ ప్రయోజనాలు ఎంటో చూద్దాం.. ! సాధారణంగా ఎగ్స్ ను ఆహారంగా నిత్యం తీసుకోవడంతో శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. జీవ క్రియరేటు కూడా మెరుగవుతుంది. గుండె సంబంధిత వ్యాధుల బారినపడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి గుడ్లు. రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా… కంటి చూపును సైతం మెరుగుపరుస్తుంది.
అయితే, గుడ్లతో చేసే వంటకంలో బటర్ లేదా ఛీజ్ను కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారనీ, ఈ కాంభినేషన్ లో ఆహార పర్ధాలు తీసుకోకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, కొబ్బరి నూనే, గుడ్ల కాంభినేషన్తో చేసిన వంటకం ద్వారా శరీర బరువు తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. కొబ్బరి నూనే, గుడ్లతో చేసిన వంటకం ద్వారా గుండే సంబంధ వ్యాధులు దరిచేరవనీ, అలాగే, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
క్వినోవా, ఎగ్స్ కలిపి చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్లకూడా శరీరానికి మంచి ఫలితం ఉంటుంది. మిరియాలతో ఎగ్ కర్రీ చేసుకుని తినడంతో శరీరంలో ఫ్యాటీ కణాలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. జలుబు, దగ్గు వంటి సాధారణ అనారోగ్య సమస్యలు కూడా మిరియాలు, ఎగ్ కలిపి వండిన ఆహార పదార్థాలతో తగ్గిపోతాయి. అలాగే, కాప్సికం, గుండ్లను కలిపి వండిన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి డబుల్ రేటు లాభం చేకూరుతుంది. ఇందులోని సీ విటమిన్ కొవ్వును కరిగించడంతో సహాయపడుతుంది.