హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్ లో రేపిన ప్రకంపనలు ఇంకా చల్లారట్లేదు. రోజూ ఎవరొకరు దీనిపై స్పందిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ప్రముఖ సీనియర్ హీరోయిన్ పూజాభట్ కు కంగనా రనౌత్ కు మధ్య ట్విట్టర్లో చిన్న సంభాషణ జరిగింది. తమ ప్రొడక్షన్ హౌస్ ఎప్పుడూ కొత్తవారి టాలెంట్ ను ప్రోత్సహిస్తోందని పేర్కొంది. అందులో భాగంగానే కంగనా రనౌత్ బాలీవుడ్ కు ఇంట్రొడ్యూస్ అయింది అని పేర్కొంది.
దీనిపై కంగనా కూడా స్పందించింది. ఊరికే ఎవరూ అవకాశం ఇవ్వరు. అనురాగ్ బసుకు కళ్లు ఉన్నాయి. టాలెంట్ లేకపోతే నన్ను గ్యాంగ్ స్టర్ సినిమాకు తీసుకోరు. ఇంకా చెప్పాలంటే అదే సమయంలో నేను తెలుగులో పోకిరి సినిమా ఆడిషన్ కు వెళ్లి సెలక్ట్ అయ్యాను కూడా. కానీ గ్యాంగ్ స్టర్ లో అవకాశం వచ్చిందని నేను ఆ సినిమా వదులుకున్నాను అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో పోకిరిలో హీరోయిన్ గా ఫస్ట్ చాయిస్ ఇలియానా కాదని తేలిపోయింది. కానీ పోకిరితో ఇలియానా స్టార్ హీయరోయిన్ అయిపోయిన విషయం తెలిసిందే.
అయితే ఈ చర్చంతా సుశాంత్ టాలెంట్ ను బాలీవుడ్ గుర్తించింది కాబట్టే అనే పూజా వ్యాఖ్యలపై జరిగింది. అంత టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తే సుశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడో ఆలోచించాలి అంటూ కంగనా కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది. మొత్తానికి ఇంకా సుశాంత్ ఆత్మహత్య రేపిన ప్రకంపనలు ఇంకా ఆగలేదని అర్ధమవుతోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!