Kangana Ranaut : ఇటీవల కాలంలో సోషల్ మీడియా అయినా ట్విట్టర్ ఖాతాపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను తొలగించారు. అదేవిధంగా పోస్టులు డిలీట్ వంటి అంశాలు ఎంతటి వివాదాన్ని రేపాయో అందరికీ తెలిసినదే. మనదేశంలో చాలామంది ఎక్కువగా ఉపయోగించే సోషల్ మీడియా ఏదంటే ట్విట్టర్ అనే చెప్పవచ్చు. ఎంతో మంది యూజర్లు ఉన్న ఈ ట్విట్టర్ కు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మరొక యాప్ రావడంతో ట్విట్టర్ పై కొంత ప్రభావం చూపుతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం ట్విట్టర్ కు దేశీయ యాప్ గా “కూ” ను పేర్కొంటున్నారు.ప్రస్తుతం ఈ దేశీ యాప్ ను మన దేశంలో చాలా మంది ప్రముఖులు వాడటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అయినటువంటి రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్ వంటివారు ఈ యాప్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ట్విట్టర్ ద్వారా ట్వీట్లతో చెలరేగిపోయిన బాలీవుడ్ వివాదాస్పద బ్యూటీ కంగనా రనౌత్ చేసిన కొన్ని ట్వీట్ లను ట్విట్టర్ డిలీట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ బాలీవుడ్ నటి కూడా “కూ”యాప్ లో చేరింది.
ట్విట్టర్ కు కౌంటర్ ఇచ్చిన కంగనా:Kangana Ranaut
నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలను ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తున్న కంగనా రనౌత్ తాజాగా తాను కూ లో చేరిన కొద్దిసేపటికి ఇక ట్విట్టర్ పని అయిపోయిందని ట్విట్టర్ యాప్ కి కౌంటర్ ఇచ్చింది.ఈ సందర్భంగా కంగనా ట్వీట్ చేస్తూ..”ట్విటర్ నీ టైమ్ అయిపోయింది. కూ యాప్కు హాయ్ చెప్పే సమయం వచ్చింది. త్వరలోనే అకౌంట్ వివరాలు తెలియజేస్తా దేశీయంగా అభివృద్ధి చెందిన ఒక యాప్ లో చేరడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది” అంటూ కంగనా ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే దేశీయ యాప్ అయినా కూ కి దేశంలో మరింత వినియోగం పెరుగుతోందని తెలుస్తోంది. అదేవిధంగా వాట్సాప్ కూడా ప్రత్యామ్నాయంగా సందేశ్ యాప్ అనే యాప్ ను రూపొందించారు. త్వరలోనే ఈ యాప్ కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!