కరోనా వైరస్ రోజు రోజుకీ ప్రమాదకరంగా మారుతోంది. సామాన్యుల నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వరకూ ఎవరినీ వదలటం లేదు. ప్రస్తుతం కర్ణాటకలో స్టార్ ప్రొడ్యూసర్ కు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ప్రముఖ కన్నడ సినీ నిర్మాత రాక్ లైన్ వెంకటేశ్ కు కరోనా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో ఆయన్ను బెంగళేరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స్ చేయిస్తున్నారు. ప్రస్తుతం కన్నడ సినీ ఇండస్ట్రీలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.
రాక్ లైన్ వెంకటేశ్ డాక్టర్ కావడంతో ఆయన పర్యవేక్షణలోనే వైద్యం అందిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాక్ లైన్ వెంటకేశ్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలుస్తోంది. గత వారం ప్రముఖ సినీ నటి, మాండ్య ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈమధ్యే వీరిద్దరూ కలిసి కర్ణాటక సీఎం యడ్యూరప్పను కలిసి అంబరీష్ మెమోరియల్ ట్రస్ట్ కోసం కలిశారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చిందని అంటున్నారు. సుమలత ఇంట్లోనే వక్తిగత వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలుస్తోంది.
రాక్ లైన్ వెంకటేశ్ పలు భారీ ప్రాజెక్టులు తెరకెక్కించారు. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘భజరంగీ భాయిజాన్’, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘లింగా’, తెలుగులో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన ‘పవర్’ సినిమాలను తెరకెక్కించారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!