ప్రముఖ బాలీవుడ్ రచయిత జావెద్ అక్తర్ను మహారాష్ట్ర కర్ణిసింగ్ అధ్యక్షుడు జీవన్ సింగ్ బెదిరించడం సర్వత్రా చర్చకు దారి తీస్తుంది. ముస్లిం మహిళలు బుర్ఖా ధరించకుండా నిషేధం విధించాలంటూ బోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాఠాగూర్ స్పందించారు. బుర్ఖాను నిషేధించే సమయంలోనే గూన్ఘాట్ను(మేలిముసుగు)ను కూడా నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. దీని గురించి జీవన్ సింగ్ మాట్లాడుతూ `మూడు రోజుల్లో క్షమాపణలు చెప్పాలని జావెద్కు చెప్పాం. లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పాం` అని అన్నారు. మరో పక్క వీడియోలో `క్షమాపణలు చెప్పకపోతే నీ కళ్లు పీకేస్తాం, నాలుక కోసేస్తాం. మీ ఇంట్లోకి వచ్చి చితకబాదుతాం` అని బెదిరించారు.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!