అమరావతి: ఎన్నికల సంఘం ఒక పార్టీకి కొమ్ముకాయడం బాధాకరమని మంత్రి కిమిడి కళా వెంకట్రావు అన్నారు.కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన బహిరంగ లేఖ రాశారు.
కోడ్ పేరుతో 72 రోజుల పాటు పాలనను నిర్వీర్యం చేయడం సరికాదని కళా వెంకట్రావు పేర్కొన్నారు.ప్రధాని మోది కులం, మతం, సైన్యాన్ని ప్రచారానికి వాడుతుంటే ఈసికి కనిపించడం లేదా, ప్రచారానికి నీతి ఆయోగ్ను మోది వాడుకోవడం కోడ్ ఉల్లంఘన కాదా అని కళా వెంకట్రావు ప్రశ్నించారు. మోది చెప్పుచేతల్లో వ్యవస్థగా ఈసి మారిపోయిందని కళా వెంకట్రావు విమర్శించారు.
ప్రధాని మోది, సీఎం తెలంగాణ సిఎం కెసిఆర్ సమీక్షలకు ఎన్నికల కోడ్ వర్తించదా అని లేఖలో కళా వెంకట్రావు ప్రశ్నించారు.ఓట్ల లెక్కింపుపై సిఎస్ సమీక్ష ఎలా నిర్వహిస్తారని కళా వెంకట్రావు మరోసారి ప్రశ్నించారు.