Acharya: `భరత్ అనే నేను` వంటి హిట్ మూవీతో తర్వాత కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం `ఆచార్య`. ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తే.. ఓ కీలక పాత్రను ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోషించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.
ఇందులో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించగా.. మణిశర్మ సంగీతం అందించాడు. నక్సల్ బ్యాక్ డ్రాప్లో కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసేందుకు చిత్ర టీమ్ ప్రచార కార్యక్రమాలను షురూ చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇందులో భాగంగానే డైరెక్టర్ కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే రీ షూట్ల వల్ల టైమ్ వృధా అయిందని, అందుకే సినిమా ఆలస్యమైందంటూ గతంలో ప్రచారం జరిగింది. ఈ రూమర్పై తాజా ఇంటర్వ్యూలో కొరటాల స్పందించారు. ఇప్పటి వరకు తన సినిమాలేవీ రీ షూట్ చేయలేదని చెప్పిన కొరటల.. అసలు రీషూట్లు చేస్తే తప్పేంటి..? అని ప్రశ్నిస్తూ ఫైర్ అయ్యారు.
`రీషూట్ చేయడం పట్ల అందరు తప్పుడు భావనతో ఉన్నారు. రీషూట్ అంటే ఓ సీన్ని ఆడియెన్స్ కి ఆకట్టుకునేలా తీయడం. బాగ రాని సీన్ని అలా వదిలేయలేయకుండా.. వాటిని మరింత బెటర్గా తీసేందుకు రీషూట్లు చేయాల్సి వస్తుంది. సినిమాని నమ్మి ఆడియెన్స్ వస్తారని, వారికి అన్యాయం చేయలేకే.. రీషూట్లు చేస్తుంటారు` అంటూ కొరటాల చెప్పుకొచ్చారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!