Kushboo: సీనియర్ నటి ఖుష్బూ అందరికీ తెలుసు. దక్షిణాది చలనచిత్ర రంగంలో 90లలో బిజీ హీరోయిన్. దాదాపు టాప్ హీరోలందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ అప్పట్లో నాగార్జున తో నటించిన రక్షకుడు సినిమాతో మంచి క్రేజ్ ని సంపాదించింది. అయితే ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళటం తో పాటు మళ్లీ సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వడం.. కీలకమైన పాత్రలు చేస్తూ ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తుంది. ఇదిలా ఉంటే తెలుగులో ఒకప్పుడు సత్తాచాటిన చాలా మంది సీనియర్ హీరోయిన్స్… పెద్దపెద్ద ప్రాజెక్టులలో కీలకమైన పాత్రలు చేస్తూ కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
“బాహుబలి” తో రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లు అందుకుంటూ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ లో నటిస్తోంది. అదేవిధంగా మీన, విజయశాంతి, స్నేహ, ఆమని వంటి ఒకప్పటి హీరోయిన్లు వస్తూ ఉండటంతో టాలీవుడ్ లో ఒకప్పటి కల కనువిందు చేస్తుంది. ఇదిలా ఉంటే స్టార్ హీరోయిన్ రష్మిక నటించిన “ఆడవాళ్లు మీకు జోహార్లు” సినిమాలో రాధిక, కుష్బూ, ఊర్వశి నటించడం విశేషం. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 4 వ తారీకు రిలీజ్ కానుంది.
అయితే తాజాగా ఈ సినిమా గురించి కుష్బూ మాట్లాడుతూ..”ఆడవాళ్లు ఎప్పుడూ గ్లిజరిన్ వాడే క్యారెక్టర్లే చేస్తారనే ఒక విమర్శ.. ఈ సినిమాతో మరుగున పడుతుంది అని పేర్కొన్నారు. ఆడవాళ్ళు నవ్వించగలరు నవ్వుతూ నవ్విస్తూ… ఆడియన్స్ ను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తారు అని ఈ సినిమా రుజువు చేస్తుంది అని తెలిపారు. చాలా ఆహ్లాదకరంగా సినిమా సాగుతుంది. అప్పుడే సినిమా అయిపోయిందా.. అని అనుకుంటారు. ఆ రీతిగా గొప్పగా దర్శకుడు చిత్రీకరించారు అని తెలిపారు. ఈ సినిమా చూశాక నా పాత్ర ఎలా ఉంది అనేది ప్రేక్షకులే చెప్పాలి. ఖచ్చితంగా మంచి మార్కులు పడతాయి అని అనుకుంటున్నాను. కొత్త దర్శకులు… కొత్త ఆలోచనలతో వస్తే కనుక స్క్రిప్టు నచ్చితే గ్యారెంటీగా కొత్త డైరెక్టర్లతో పని చేయడానికి నేను రెడీ గా ఉన్నాను అంటూ…ఖుష్బూ కొత్త స్టేట్మెంట్ ప్రకటించింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!