Prabhas: నేషనల్ స్టార్ ప్రభాస్ ఇటీవలె `రాధేశ్యామ్`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆయనతో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు పోటీ పడుతూ ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్లో `సలార్` ఒకటి.
`కేజీఎఫ్`తో స్టార్ ఇమేజ్ను సొంతం కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ కిరాగందుర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గత ఏడాది కొంత షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. మిగిలిన భాగాన్ని త్వరత్వరగా పూర్తి చేయాలని ప్రశాంత్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల షూటింగ్ను రీస్టార్ చేసి.. ప్రభాస్పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అయితే ప్రభాస్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు.. ప్రశాంత్ ఆయనకు బ్రేక్ కూడా ఇవ్వడం లేదట.
ఇక రీసెంట్గా ఓ రోజు అర్థరాత్రి 1 గంట అయినా ప్రభాస్ను ఆయన వదల్లేదట. షూటింగ్ చేస్తూనే ఉన్నారట. ఈ లెక్కన ప్రభాస్ సలార్ కోసం రేయింబవళ్లు ఎంతలా కష్టపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. కాగా, ఈ మూవీతో పాటు ప్రభాస్ ఓం రౌత్తో `ఆదిపురుష్`, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో `ప్రాజెక్ట్-కె`, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` అనే చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో ఆదిపురుష్ షూటింగ్ ఇటీవలె పూర్తైంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!