Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ కొత్త ప్రయోగం చేస్తున్నారు.. ప్రయోగంతో పోరాటమే చేస్తున్నారు.. ప్రపంచం మొత్తం ఆపలేని.. ఇండియా కూడా ఆపలేక నానా అగచాట్లూ పడుతున్న మహమ్మారిని తన ఇంటి దరిదాపుల్లోకి కూడా రాకుండా కొన్ని అతి జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఈ చర్యలతో మహేష్ బాబు అభిమానుల్లో ఆందోళన నెలకొంది.. మహేష్ ఇంటిని రెండు రోజులుగా పరిశీలిస్తున్న ఆయన అభిమానులు కలవరపాటుకు గురవుతున్నారు..? లోపల ఏం జరుగుతుంది..!? మహేష్ కి ఏమైంది..!? అనే ఆందోళనలో ఉంటున్నారు. ఆయన ఇంటి భుట్టో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటికి రోజూ వెళ్లే పని వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ రాకుండా ఆపేస్తున్నారు. ప్రహరీ లోపలి కూడా అనుమతి ఇవ్వడం లేదు.. ఇంతకూ విషయం ఏమిటా అని ఆరాతీస్తే…
Mahesh Babu: కరోనా భయంతో మహేష్ కుటుంబం..!
టాలీవుడ్ లో చాలా మంది పెద్ద స్టార్లకు కరోనా సోకింది. చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ సహా చిన్న, పెద్ద నటులకు కరోనా వచ్చింది. కొందరిలో వెంటనే తగ్గుతుంది. కొందరిని ఇబ్బంది పెడుతుంది. గత ఏడాది అయితే ప్రఖ్యాత నేపథ్య గాయకుడూ ఎస్పీ బాలు కరోనా కారణంగానే మరణించారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మహేష్ కుటుంబమే కరోనా బారిన పడలేదు. ఆ ఇంట్లో మహేష్, భార్య నమ్రత, ఇద్దరు పిల్లలు ఉంటారు. వారి మధ్య అనుబంధం ఎక్కువగా ఉంటుంది. నిత్యం ఆటలాడుతూ కలిసే ఉంటారు. అందుకే ఏ ఒక్కరికి పాజిటివ్ వచ్చినా అందరికీ వస్తుందని మహేష్ ఆందోళన చెందుతున్నారట. అందుకే కరోనా సోకకుండా అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. బందోబస్తు పెంచారు. టన్నెల్ ఏర్పాటు చేసారు. ఇంటి పని మనుషులకు రోజూ కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. వెంటనే ఫలితం వచ్చేసేలా చూసుకుంటున్నారు. నెగిటివ్ అని తేలితేనే లోపలకు రానిస్తున్నారు. ఇలా గడిచిన నెల రోజుల నుండి నిత్యం చేస్తున్నారు. ఈ రెండు రోజుల నుండి టన్నెల్ ఏర్పాటు, బందోబస్తు పెంచడం, అపరిచితులు బయట కూడా రానీయకుండా చూసుకోవడం వంటివి చేస్తున్నారు. మహేష్ పిచ్చిగానీ ఆపితే కరోనా ఆగుతుందా అనుకునే వాళ్ళు కొందరు ఉంటె.. పిల్లలు ఉన్నారు కాబట్టి.. బాధ్యతగా ఈ జాగ్రత్త మంచిదే అంటూ కొందరు చెప్పుకుంటున్నారు..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!