Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మంచి జ్యోష్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈయన హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టి.. నిర్మాతలకు లాభాలను మిగిల్చింది. దీంతో గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అయిన బాలయ్య ఈ మూవీతో ఎట్టకేలకు సక్సెస్ ట్రాక్ ఎక్కారు. మరోవైపు ఆహా వేదికగా ఈయన చేసిన `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` టాక్ షో కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇక ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నాడు.
శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఇటీవలె ప్రారంభమైంది. ఇదిలా ఉంటే.. బాలయ్యతో ఓ దర్శకుడు మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు.. పరుశురామ్. గతంలో ఈయన బాలయ్యకు ఓ స్టోరీ లైన్ చెప్పగా బాలయ్య పాజిటివ్ గా స్పందించారట.
దీంతో పరుశురామ్ ఇప్పుడు అదే లైన్ తో కథ సిద్ధం చేస్తున్నారట. ఇక ఇందులో బాలయ్యతో పాటు మరో హీరో సైతం కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నారు. కాగా, పరుశురామ్ ప్రస్తుతం మహేష్ బాబుతో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తి అయిన తర్వాత బాలయ్య, పురుశురామ్ సినిమా ఉంటుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.