Rashmika Mandanna: సూపర్ స్టార్ మహేష్ మాతృమూర్తి ఇందిరా దేవి నిన్న ఉదయం మరణించడం తెలిసిందే. ఆమె మరణం పట్ల తిని మరియు రాజకీయ రంగానికి చెందిన చాలామంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నాగార్జున, విజయ్ దేవరకొండ, రానా, సుకుమార్, త్రివిక్రమ్, వెంకటేష్, కొరటాల శివ, బండ్ల గణేష్, మోహన్ బాబు, కీర్తి సురేష్, శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను, మంచు విష్ణు… తదితరులు భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. ఇంకా బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్, సురేందర్ రెడ్డి .. మరి కొంతమంది నిన్ననే తమ సంతాపాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ఇదిలా ఉంటే మహేష్ తల్లి ఇందిరాదేవి చనిపోయి అంత్యక్రియలు కూడా అయిపోయి 24 గంటలు తర్వాత హీరోయిన్ రష్మిక మందన ట్విట్టర్ లో “రెస్ట్ ఇన్ పీస్ అమ్మ” అని పోస్ట్ పెట్టడం పట్ల మహేష్ అభిమానులు ఫుల్ సీరియస్ అవుతున్నారు. ఏంటమ్మా ఇప్పుడా స్పందించేది..?, నిన్నంతా ఏం చేశావు..?, ఇప్పుడు గుర్తొచ్చిందా మేడం అంటూ సీరియస్ కౌంటర్లు ఇస్తున్నారు. నార్మల్ హీరోయిన్ గా ఉన్న నిన్ను మా అభిమాన హీరో సరిలేరు నీకు ఎవరు సినిమాలో ఛాన్స్ ఇచ్చి ఒక స్టార్ స్టేటస్ వచ్చేలా చేశారు. అటువంటి హీరో తల్లి మరణించి.. అంత్యక్రియలు జరిగి ఒకరోజు అయిపోయాక స్పందించడం దారుణమని మహేష్ ఫ్యాన్స్ ఫుల్ సీరియస్ అవుతున్నారు.
మరోపక్క ఓకే ఏడాదిలో ఇద్దరు మరణించడంతో ఘట్టమనేని ఫ్యామిలీ దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ముఖ్యంగా మహేష్ చాలా బాధపడుతున్నాడట. జనవరిలో తన అన్నయ్య రమేష్ బాబు నిన్న తల్లి ఇందిరాదేవి ఇద్దరు కూడా తనకి ఎంతో దగ్గర మనుషులు కావటంతో మహేష్ ఎంతగానో కలత చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక ఇదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!