సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. గీత గోవిందం సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన పరశురాం ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్, 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ముందు కీర్తి సురేష్ ని తీసుకోవాలని టీం భావించినప్పటికి కియారా అద్వాని పేరు కూడా బాగా ప్రచారం జరిగింది. భరత్ అనే నేను తో మహేష్ కియారా జంట సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేసింది.
అందుకే మొన్నటి వరకు చిత్ర బృందం కియారా వైపే మొగ్గు చూపింది. కాని ప్రస్తుతం బాలీవుడ్ లో కియారా కమిటయిన సినిమా డేట్స్ తారుమారు కావడంతో సర్కారు వారి పాట కి డేట్స్ సర్ధుబాటు చేయలేకపోతుందని అందుకే కీర్తి సురేష్ ని తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సర్కారు వారి పాటలో కీర్తి సురెష్ ఫైనల్ అయిందని ఇదే అఫీషియల్ అని వార్తలు వస్తున్నాయి. కాని చిత్ర బృందం మాత్రం ఇంకా అధికారకంగా వెల్లడించలేదు.
అయితే ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం కియారా అద్వాని సర్కారు వారి పాటకి డేట్లు సర్ధుబాటు చేయాలనుకుంటుందట. కాని ఇప్పుడు ఆ అవకాశం కీర్తి సురేష్ లేకుండా చేస్తుందని తెలుస్తుంది. రెమ్యూనరేషన్ పరంగా కియారాకి ఎక్కువే ముట్టజెప్పాలి. కాని కీర్తి సురేష్ మాత్రం రీసెంట్ గా నిమాతల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కథ నచ్చితే తన రెమ్యూనరేషన్ తగ్గించుకుంటానని ఓపెన్ గా చెప్పింది. అందుకే సర్కారు వాఇ పాట టీం కీర్తి ని ఫైనల్ చేయాలనుకుంటున్నారట. అయితే ఈ విషయంలో ఫైనల్ డెసిషం మాత్రం మహేష్ బాబు దే అంటున్నారు. ఈ రకంగా చూస్తే కియారా కీర్తి సురేష్ ల మధ్య మహేష్ బాబు బాగానే ఇరుక్కున్నాడని అంటున్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!