Guntur kaaram: నేడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మహేష్ త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి అప్ డేట్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ ముందే ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం 6:23 నిమిషాలకు చెప్పిన రీతిగానే “SSMB28” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాకి “గుంటూరు కారం”గా టైటిల్ ప్రకటించి మాస్ స్ట్రైక్ వీడియో ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది. ఒక నిమిషం మూడు సెకన్ ల నిడివి గలిగిన ఈ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
పక్క మాస్ సినిమా అని ఈ వీడియోతో త్రివిక్రమ్ తేల్చేశాడు. నోట్లో బీడీ వెలిగించుకుని మహేష్ బాబు రావటం.. తో పాటు ఏందట్టా చూస్తున్నావ్… బీడీ త్రీడీలో కనబడుతుందా.. అంటూ మహేష్ తనదైన స్లాంగ్ లో డైలాగ్ చెప్పటంతో.. అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. పక్కా డీ గ్రేడ్ మాస్ తరహా హీరోగా మహేష్ బాబుని సరికొత్తగా మరోసారి త్రివిక్రమ్ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తమన్ అందించిన మ్యూజిక్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాని రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే మరియు శ్రీ లీల హీరోయిన్ పాత్రలలో కనిపిస్తున్నారు.
గతంలో త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లలో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో వస్తున్న ఈ మూడో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. “గుంటూరు కారం” గా రాబోతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 13వ తారీకు సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పల్నాడు నేపథ్యంలో సరికొత్త తరహా స్టోరీతో మహేష్ బాబుని చూపించబోతున్నట్లు సమాచారం. తెలుగు చలనచిత్ర రంగంలో ఇప్పటివరకు కోనసీమ లేదా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి సినిమాలు ఎక్కువగా వచ్చాయి. అయితే త్రివిక్రమ్ కొత్తగా పల్నాడు టచ్ తో మహేష్ ని సరికొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!