Nayanathara: ‘గాడ్ ఫాదర్’..మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇచ్చి మెగా ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేశారు లేడీ
సూపర్ స్టార్ నయనతార. మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన లూసీఫర్ సినిమాకు గాడ్ ఫాదర్ చిత్రం అధికారిక రీమేక్ అనే విషయం తెలిసిందే. వాస్తవంగా ఈ సినిమా
ఎప్పుడో షూటింగ్ పూర్తై ఈ పాటికే రిలీజ్ కావాల్సింది. కానీ, ఇద్దరు దర్శకులు రీమేక్ కథ మీద కసరత్తులు చేసి విఫలమయ్యారు. అలా కొన్ని నెలలు ఈ ప్రాజెక్ట్ తెలుగు వెర్షన్ మొదలవడానికి ఆలస్యం అయింది. ఆ తర్వాత ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ దర్శకుడు మోహన్ రాజా తన మార్పులు చేర్పూలతో చిరును మెప్పించి మొదలు
పెట్టారు.
అయితే, దీనికంటే ముందు కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో గాడ్ ఫాదర్ మొదవలడానికి బాగా ఆలస్యం అయింది. ఇక షూటింగ్ మొదలై కొంత టాకీ పార్ట్ పూర్తవగానే కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వచ్చి పడి..అలా కొన్ని నెలలు చిత్రీకరణ దశలోనే ఆగిపోయిది. ఎట్టకేలకు మళ్ళూ సెట్స్ మీదకి వచ్చిన ఈ సినిమా చక చకా సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు దర్శకుడు మోహన్ రాజా. మొన్నా మధ్య కొత్త సినిమా షూట్ పూర్తి చేసి చెన్నై వెళుతున్న సమయంలో మీడియా కంటపడ్డారు నయన్.
Nayanathara: గాడ్ ఫాదర్ సినిమాతో కలిసి నయన్తో చేస్తున్న మూడవ సినిమా
ఆ సమయంలో కొన్ని పిక్స్ రిలీజై నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఇక తాజా దర్శకుడు మోహన్ రాజాతో కలిసి నయనతార ఈ మూవీ షూట్కు సంబంధించిన అప్డేట్
ఇచ్చారు. నయనతారకు సంబంధించిన కీలక షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఇందులో ఆమె పాల్గొన్న పలు ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా విషయాన్ని
తెలియజేస్తూ దర్శకుడు మోహన్ రాజా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్లో నయన్ దర్శకుడితో కలిసి ఉన్నారు. కాగా, ఇంతకముందు రెండు సినిమాలు చేసిన
మోహన్ రాజా గాడ్ ఫాదర్ సినిమాతో కలిసి నయన్తో చేస్తున్న మూడవ సినిమా అని పోట్లో పేర్కొన్నారు. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడు థమన్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!