సినిమాల పరిస్థితి కరోనా ముందు.. కరోనా తర్వాత అన్నట్లుగా మారిపోయింది. ఎందుకంటే ప్రేక్షకులు తమ మైండ్ సెట్ పూర్తిగా మార్చేసుకున్నారు. చాలా మంది సినిమాలను డిజిటల్ ప్లాట్ ఫారమ్ లలో చూసేందుకే ఇష్టపడుతున్నారు. సాధారణ సినిమాలు చూస్తే వారికి ఎక్సైట్మెంట్ రావడం లేదు.. కరోనా ముందు అనుకున్న స్టోరీలతో సినిమా తీస్తే ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈనేపథ్యంలో దర్శక, నిర్మాతలు సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కొరటాల శిల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో ఆచార్య సినిమా తీసిన సంగతి తెలిసిందే. వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న కొరటాల శివకు ఆచార్య రూపంలో భారీ ఫ్లాప్ వచ్చింది.. ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఈనేపథ్యంలో కొరటాల శివ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. తారక్ తో కొరటాల శివ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే..
ఎన్టీఆర్ తో సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది.. కానీ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. దీనికి కారణం కొరటాల శివ ఎన్టీఆర్ కోసం కొత్త కథను సిద్ధం చేస్తున్నారట. ఆచార్య సినిమా పరాజయంతో ఎన్టీఆర్ తో సినిమా విషయంలో కొరటాల శివ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు.. ఈ సినిమా నిర్మాత మిక్కిలినేని సుధాకర్ కూడా కొరటాల శివకు అత్యంత సన్నిహితుడు. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సహ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తోంది. దీంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక సినిమా కథ మీద మరోసారి వర్కౌట్ చేస్తున్నారని సమాచారం.. ముందు అనుకున్న కథ కంటే ఇప్పుడు సిద్ధం చేస్తున్న కథ భారగీ ఉంటుందని కొరటాల శివ సన్నిహితులు చెబుతున్నారు. సినిమా షూటింగ్ కూడా నవంబర్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!