NTR: టాలీవుడ్లోకి మరో కొత్త నటుడు రాబోతున్నాడు. అతడే యంగ్ టైగర్ NTR భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు నితిన్ చంద్ర నార్నే. ఇతడు త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సినిమా పేరు ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీశ్ వేగేశ్న ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు స్వీకరించాడు. ఆల్రెడీ టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని నార్నే శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మలయాళ సూపర్ హిట్ ‘తీవండి’ (పొగబండి) చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అని సమాచారం.
NTR: ఒకేసారి డబుల్ ఇంపాక్ట్ ఇవ్వబోతున్న యంగ్ టైగర్..!
NTR: మలయాళ సినిమా?
టోవినో థామస్, సంయుక్త మీనన్ జంటగా నటించిన మలయాళ చిత్రం కేరళ తంబీలను అమితంగా ఆకట్టుకుంది. చిన్నప్పటి నుంచి ధూమపానానికి అలవాటు పడ్డ ఒక యువకుడు తన ప్రేమను గెలిపించుకోడానికి ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు అన్నదే ఈ సినిమా కథాంశం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఒరిజినల్ వెర్షన్ లో చాలా మార్పులు చేసి ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ చిత్రాన్ని మలిచినట్టు తెలుస్తోంది. ఇక హోలీ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.
NTR: మార్చి 26 అర్థరాత్రి అలా చేసేవాడ్ని.. టాప్ సీక్రెట్ బయటపెట్టిన తారక్!
ఫస్ట్ లుక్ ఎలా ఉందంటే?
ఈ ఫస్ట్ లుక్ లో NTR బావమరిది సిగరెట్ ముట్టిస్తూ, నితిన్ స్టైల్ గా నడుచుకొని వస్తున్న లుక్ ఆకట్టుకుంటోంది. పూర్తిగా తూర్పుగోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో చిత్రం నిర్మాణం జరుపుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కాబోతోంది. నిజానికి దర్శకుడు తేజ.. నితిన్ చంద్రను లాంఛ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని అనూహ్యకారణాలవలన ఎందుకనో అది వర్కవుట్ కాలేదు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!