Acharya: కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).. రామ్ చరణ్(Ram Charan) ఫస్ట్ టైం లాంగ్ లెన్త్ రోల్ నటించిన సినిమా “ఆచార్య”(Acharya). భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29వ తారీకు విడుదలైన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఏమాత్రం అభిమానులను అలరించలేకపోయింది. వరుస విజయాలు తీసిన కొరటాల.. దగ్గర నుండి ఇటువంటి సినిమా రావటం దురదృష్టం అని అభిమానులు అప్పట్లో కామెంట్ లు చేశారు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాపై సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కామెంట్ చేశారు. ఇటీవల “ఆచార్య” చూసాను అంటూ సోషల్ మీడియాలో తెలిపారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
చిరంజీవి, చరణ్ ఇద్దరు కలిసి నటించిన సినిమాకు “ఆచార్య” అనే టైటిల్ పెట్టకుండా… ఉండాల్సింది అని అన్నారు. సినిమా చూస్తే మరో మలుపు సినిమా గుర్తొచ్చిందని చెప్పకు వచ్చారు. సినిమా పరంగా తప్పులేదు కానీ స్టోరీలో ముఖ్యమైన సంఘటన ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది చెప్పకుండా స్టోరీని నడిపించిన తీరు… సినిమా చూసే ప్రేక్షకుడిని కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది. ఇక కథలో ఎప్పుడూ కూడా సస్పెన్స్ మరియు సెంటిమెంట్ ఒకే చోట ఉండలేవు. చరణ్ చేసిన సిద్ధా క్యారెక్టర్ సినిమా మొదటి భాగం లోనే వచ్చి ఉంటే బాగుండేది. అంతా కాకపోయినా గానీ సినిమా ఫస్ట్ ఆఫ్ లో సిద్ధ పాత్ర ఉంటే సినిమా మరోరకంగా ఉండేది.
ఇంక సినిమాలో డైలాగులు కథంశం పెర్ఫార్మన్స్ అంతా బాగానే ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిజం… భావజాలం ఉన్న సినిమాలు ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చటం లేదు అని గోపాలకృష్ణ తనదైన శైలిలో తెలిపారు. ఇంకా ఆయన తెలియజేస్తూ ఫ్లాష్ బ్యాక్.. 10 శాతం నుంచి 90 శాతం కథలో చిరంజీవి ఉండి ఉంటే.. సినిమా ఇంకా బాగుండేది. సినిమాకి సంగీతం కూడా పెద్దగా కుదరలేదు. కమ్యూనిస్టు భావజాలం కలిగిన చిరంజీవి పాత్ర డాన్స్ చేయకుండా ఉంటే బాగుండేది.. అంటూ సోషల్ మీడియాలో పరుచూరి గోపాలకృష్ణ సంచలన పోస్ట్ పెట్టారు. దీంతో పరుచూరి గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!