Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత దూకుడుగా సినిమాలను కమిటవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ నుంచి ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా రీమేక్ చేయడం విశేషం. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, తాప్సీ నటించిన పింక్ ఆధారంగా వకీల్ సాబ్, మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన అయ్యప్పనుం కోషియం ఆధారంగా ‘భీమ్లా నాయక్’ రూపొందించారు. బ్యాక్ టు బ్యాక్ ఈ సినిమాలతో పవర్ స్టార్ ఖాతాలో హిట్స్ చేరాయి.
వకీల్ సాబ్ సినిమా థియేటర్స్లో మాత్రమే కాకుండా ఓటీటీలోనూ ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదే క్రమంలో ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. రానా దగ్గుబాటి మరో హీరోగా నటించిన ఈ మల్టీస్టారర్ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య గత నెల 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్బస్టర్ హిట్ సాధించింది. భారీగా కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమాలో పవర్ స్టార్, రానాల పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
Pawan kalyan: అక్కడ చూడలేని వారు ఓటీటీలలో చూసేందుకు రెడీ
నిత్యా మీనన్ కూడా అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంది. ఇక థమన్ అందించిన సంగీతం ఈ సినిమా సక్సెస్కు ప్రధాన కారణంగా నిలిచింది. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాం మీద వస్తుందని అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ తాజాగా మేకర్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నందు విడుదల చేస్తున్నట్టు తేదీని ప్రకటించారు. ఈ మూవీని మార్చి 25 నుంచి స్ట్రీమింగ్కి తీసుకొస్తున్నట్టు తాజాగా ఆహా ఓటీటితో పాటు, డిస్నీ సంస్థలు ప్రకటించాయి. దీంతో ఇప్పటికే థియేటర్స్లో చూసిన వారు.. అక్కడ చూడలేని వారు ఓటీటీలలో చూసేందుకు రెడీ అవుతున్నారు.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!