Chiru Pawan: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 40 ఏళ్ల సినీ కెరియర్ లో 150కి పైగా సినిమాలు చేసిన చిరంజీవి..సమాజానికి ఎన్నో మంచి పనులు చేయడం జరిగింది. కరోనా కష్టకాలంలో సినీ కార్మికులకు అనేక రీతులుగా సహకారం అందించారు. కరోనా లాక్ డౌన్ సమయంలో నిత్యవసరాల సరుకులు మరియు వారికి ఫ్రీగా వ్యాక్సిన్ అందించడం జరిగింది. ఇక ఇటీవలే సినీ కార్మికులకు హాస్పిటల్ కూడా నిర్మిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే తాజాగా 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా చలనచిత్ర ఉత్సవాలు సందర్భంగా.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్.. మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 ప్రకటించడం జరిగింది.
ఈ విషయాన్ని కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గోవా వేదికగా నవంబర్ 20 నుండి 28 వరకు జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా చిరంజీవికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కేంద్రం ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే అన్నయ్య చిరంజీవికి పురస్కారం రావడం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమోషనల్ గా సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
“ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరో వజ్రం. నాలుగు దశాబ్దాలు పైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం.. తనని తాను మలుచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం నాతో సహా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ చలనచిత్ర వేదికపై అన్నయ్యకు ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతగానో ఆనందిస్తున్నాను అని పవన్ తెలియజేశారు. అయితే తనకి ఈ అవార్డు రావడంకి ప్రధాన కారణం అభిమానులు అని చిరంజీవి స్పందించారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!