Prabhas: “బాహుబలి” తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్..కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. “బాహుబలి” తర్వాత నటించిన “సాహో”, “రాధేశ్యాం”… రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. “బాహుబలి”వంటి భారీ హిట్ తర్వాత ప్రభాస్ .. ఏ మాత్రం ప్రేక్షకులను… అభిమానులను అలరించలేని పరిస్థితుల్లో కి వెళ్ళిపోయాడు. ఇటువంటి పరిస్థితుల్లో “కేజిఎఫ్” వంటి సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేసిన.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ “సలార్” సినిమా చేయటం ఇండియాలోనే సంచలనంగా మారింది. ఎందుకంటే “కేజిఎఫ్” లో హీరో యాష్ నీ మాస్ ఆడియన్స్ నీ బాగా ఆకట్టుకునేలా ప్రశాంత్ నీల్ చూపించాడు.
దీంతో ఆరు అడుగుల భారీ బాడీ దేహదారుడ్యం కలిగిన ప్రభాస్ నీ “సలార్” లో ఇంకా ఎలా చూపించాడు అన్నది సస్పెన్స్ గా నెలకొంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం అప్పట్లో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నీ అప్పట్లో తీసుకోవటం తెలిసిందే. అయితే మధ్యలో కరోనా రావడంతో “సలార్” సినిమా షూటింగ్ కి సంబంధించి అనేక బ్రేకులు పడ్డాయి. ఈ తరుణంలో మరో ప్రాజెక్టు పృథ్వీరాజు ఒప్పుకోవడంతో…”సలార్” నుండి అర్ధాంతరంగా ఇటీవల తప్పుకోవటం జరిగిందట. “సలార్” కి ఇచ్చిన డేట్స్ సర్దుబాటు విషయంలో అటు..ఇటు గా ఉండటంతో పృధ్వీరాజ్ డ్రాప్ అవ్వడం జరిగిందట.
అయితే ఈ విషయం తాజాగా ప్రభాస్ దాకా వెళ్లడంతో ఎట్టిపరిస్థితుల్లోనూ పృధ్వీరాజ్ ప్రాజెక్టు నుండి బయటికి వెళ్లకుండా చూసుకోవాలని.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి తాజాగా చెప్పడం జరిగిందట. ఆ పాత్రకి పృథ్వీరాజే సరైన వాడని.. డేట్స్ తర్వాత ఆలోచించండి. పృథ్వీరాజ్ మాత్రం ప్రాజెక్టు నుండి చేజారిపోకుండా…జాగ్రత్త పడండి.. అంటూ డార్లింగ్ పట్టు పడుతున్నారట. దీంతో ఇప్పుడు “సలార్” సినిమా యూనిట్ పృథ్వీరాజ్ నీ మళ్లీ ఒప్పించే ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్టు .. పృథ్వీరాజ్ కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!