CM Jagan Delhi Tour: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రెండురోజుల పర్యటనలో భాగంగా దిల్లీకి వెళ్లి.. బుధవారం సాయంత్రానికి తిరిగి రానున్నట్టు సమాచారం. ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఈ ఇద్దరి అపాయింట్మెంట్లు కూడా ఖరారైనట్టు తెలుస్తుంది. చివరి నిమిషంలో అపాయింట్మెంట్ విషయంలో మార్పులు జరిగితే మాత్రం రేపటికి ఖరారు కానుంది. ఈ భేటీలో ముఖ్యంగా రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి, ఆర్ధిక ఇబ్బందులు, పోలవరానికి నిధుల సహకారం.., కొత్త అప్పుల కోసం అనుమతులు, మూడు రాజధానుల అంశం, కోర్టు తీర్పులు, 26 జిల్లాల విభజన వంటి అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తుంది..!
CM Jagan Delhi Tour: కీలక అంశాలపై క్లారిటీ కోసం..!?1
రాష్ట్రంలో మూడు రాజధానుల బిల్లుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర శాసనసభలో కూడా దీనిపై చర్చించారు.. సో.. ప్రధాని, హోమ్ శాఖ మంత్రి భేటీలో ఈ అంశాన్నే కీలకంగా చర్చించనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు అవసరం గురించి, 26 జిల్లాల ఏర్పాటు విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. వీటితో పాటూ పోలవరం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్ల వంటి అంశాలతోపాటు విభజన చట్టంలోని అపరిష్కృత హామీల అమలుపైనా సీఎం ప్రధానితో చర్చిస్తారని సమాచారం. ఈ అంశాలతో పాటూ.. “ప్రజాకర్షక పథకాలతో కొన్ని రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణను పాటించడం లేదని.. కేంద్రంలోని వివిధ విభాగాల కార్యదర్శులు ఈ నెల 2న ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన సమావేశంలో వెల్లడించిన విషయం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొన్న ప్రధానితో జరిగిన భేటీలో ఉన్నతాధికారులు ఏపీ గురించి స్పష్ఠంగా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే ఏపీ పరిస్థితి ఏంటనే అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అనంతరం రాత్రికి ముఖ్యమంత్రి దిల్లీలోనే బస చేయనున్నారు. బుధవారం ఉదయం అందుబాటులో ఉండే కేంద్ర మంత్రులను కలిసి తిరిగి రాష్ట్రానికి రానున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు సమాచారం..!