PSPK29: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్టు ఈరోజు ఉదయం 8:55 నిమిషాలకు అధికారిక ప్రకటన రావటం ఇండస్ట్రీలో సంచలనం రేపింది. అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చినట్లయింది. “రన్ రాజా రన్” మరియు “సాహో” సినిమాల దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. డీవివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వస్తున్న ఈ సినిమాని డీవివి దానయ్య నిర్మిస్తున్నారు. ఉదయం విడుదలైన అధికారిక పోస్టర్ లో తుఫాను సిద్ధమవుతున్నట్లు చిన్నపాటి క్యాప్షన్ తో పాటు పవన్ కళ్యాణ్ షాడో లో గన్ కనిపించడం పోస్టర్ పై మరింత ఇంట్రెస్ట్ నెలకొంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రాజెక్టు విషయంలో పవన్ కళ్యాణ్ కి పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. గతంలో డైరెక్టర్ సుజిత్..ప్రభాస్ తో “సాహో” సినిమా చేయడం జరిగింది. “బాహుబలి 2” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కాకా ఈరోజు ఉదయం డీవివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పవన్ హీరోగా సుజిత్ దర్శకుడిగా.. ప్రాజెక్టు ప్రకటించడంతో ప్రభాస్ కంగ్రాట్స్ తెలియజేశారు.
మరోపక్క సుజిత్ దర్శకత్వ పనితీరుపై పవన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క డైరెక్టర్ హరీష్…సుజిత్.. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని తాను దర్శకత్వం చేసిన “గబ్బర్ సింగ్” టైములో మీడియా వద్ద సుజిత్ చేసిన హడావిడి అరుపులు కేకలు వీడియో పోస్ట్ చేయడం జరిగింది. దీంతో అభిమానులు కొద్దిగా ఇప్పుడు ధైర్యంగా ఉన్నారు. హరీష్ కూడా పవన్ అభిమాని కావడంతో ఒక అభిమాని సినిమా తీస్తే.. ఎలా ఉంటుందో గబ్బర్ సింగ్ ఫలితం తెలియజేసింది. దీంతో సుజిత్ కూడా పవన్ అభిమాని కావడంతో.. కెరియర్ పరంగా అతడు ఫ్లాప్ లలో ఉన్నా గాని తాజా ప్రాజెక్టు పై పవన్ అభిమానులు కొద్దిగా ధైర్యంగా ఉన్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!