టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు షూటింగులకి అనుమతులు వచ్చిన దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎలా షూటింగ్స్ మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. చర్చలు మీద చర్చలు జరిపి అనుమతులు తెచ్చుకున్నప్పటికి భారీ ప్రాజెక్ట్స్ కావడంతో పరిమిత సిబ్బందితో షూటింగ్స్ చేయాలంటే సాధ్య పడటం లేదు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ కి చాలా బడ్జెట్ వేస్ట్ అయిందని సమాచారం.
అయినా నిర్మాత రాజమౌళి మీద నమ్మకంతో ఎంతైనా పెడదామనుకున్నాడు. కాని కరోనా విపత్తుతో ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నాడట. బడ్జెట్ అంటేనే భయంతో ఏం చేయాలో తోచడం లేదని అంటున్నారు. కరోనాతో ఒకేసారి ఇండస్ట్రీని కష్టాలు మబ్బులు కమ్ముకున్నట్టు కమ్ముకున్నాయి. వాటిలో ముఖ్యంగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తో పాటు సుకుమార్ అల్లు అర్జున్ ల పుష్ప కి కూడా అని సమాచారం.
ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ జరపలాని వీలైనంత త్వరగా సినిమాని కంప్లీట్ చేసి 2021 సంక్రాంతికి కాకున్నా సమ్మర్ కైనా ప్రేక్షకుల ముందుకు తీసుకు వద్దామని అనుకున్నారు రాజమౌళి. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్.టి.ఆర్.. రాం చరణ్ లే సెట్ కి వచ్చేలా కనిపించడం లేదట. దానికి తోడు ఆర్ ఆర్ ఆర్ లో బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ నటులు ఉండటం ఒక సమస్య. సినిమా మొదలు పెట్టినప్పుడు ఎవరైతే ఆర్ ఆర్ ఆర్ కి ప్లస్ అనుకున్నారో వాళ్ళే పెద్ద మైనస్ అని ఇప్పుడు అంటున్నారు.
ఇక సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పటికే కేరళ లో చిత్రీకరణ అనుకొని ఆగిపోవడం వల్ల దాదాపు 3 కోట్ల వరకు నష్టం జరిగిందని సమాచారం. దాంతో ఎలాగైనా ఫారెస్ట్ సెట్ ని హైదరాబాద్ లో వేసి జూలై లేదా ఆగస్టు నుంచి షూటింగ్ మొదలు పెట్టాలనుకున్నారట. కాని ఈ షెడ్యూల్ జరగాలంటే షూటింగ్ కి సిబ్బంది కూడా చాలా మంది అవసరం అవుతుందని అంటున్నారు. దాంతో పరిమిత సిబ్బందితో షూటింగ్ జరపడం సాధ్యం కాదని అందుకే పుష్ప షూటింగ్ ఇప్పట్లో మొదలవదని తెలుస్తుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!