హీరోయిజంను సరికొత్తగా తెరపై ఆవిష్కరించడంలో డాషింగ్డైరెక్టర్ పూరి జగన్నాథ్కు ప్రత్యేకమైన శైళి ఉంది. అందుకనే హీరోలందరూ ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ `ఇస్మార్ట్ శంకర్` అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. తనదైన శైళిలో పూరి జగన్నాథ్ రామ్ పాత్రను డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుంది. `ఇస్మార్ట్ శంకర్` సెట్స్లోకి వెళ్లక ముందే.. సీక్వెల్ కూడా చేస్తానని తెలిపిన పూరి జగన్నాథ్.. అన్నట్లుగానే ఇప్పుడు `డబుల్ ఇస్మార్ట్` టైటిల్ను రిజిష్టర్ చేయించారు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్తో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ .. కొంతకాలంగా సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్నాడు. ఫుల్ ఫోకస్తో `ఇస్మార్ట్ శంకర్`ను తెరకెక్కిస్తున్నారు. మరి పూరికి ఇస్మార్ట్ శంకర్ ఎలాంటి సక్సెస్ని ఇస్తుందో చూడాలి.
previous post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!