Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలు ఒప్పుకోవటం లో తప్ప రిలీజ్ చేయటంలో చాలా నెమ్మదిగా ప్రభాస్ వ్యవహారం ఉందన్న ఒక్క నిరుత్సాహం తప్ప ప్రస్తుతం ప్రభాస్ ఒప్పుకుంటున్న సినిమాలు.. చేస్తున్న షూటింగులు పట్ల అభిమానులు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్”, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్”, అదే రీతిలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా ఒప్పుకోవటం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రశాంత్ నీల్.. సినిమాతో పాటు బాలీవుడ్ ఆదిపురుష్… సినిమాలు ప్రభాస్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం లో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో.. టైం మిషన్ తరహాలో.. ప్రభాస్ చేయబోయే సినిమా ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దాదాపు కొన్ని వందల కోట్ల బడ్జెట్ తో ఇప్పటిదాకా ప్రభాస్ కెరియర్ లో ఎన్నడు తరగని హై బడ్జెట్ తో.. ఈ సినిమాని నిర్మించడానికి వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీదత్ రెడీ అయ్యారు.
Read More: Prabhas: దాదాపు మళ్లీ పది సంవత్సరాల తర్వాత ఆ డైరెక్టర్ తో ప్రభాస్..??
అయితే ఈ సినిమా లో కీలకమైన ఓ క్యారెక్టర్లో యంగ్ హీరోయిన్ ఏం రాసి కన్నా ని తీసుకోవడానికి నాగ్ అశ్విన్ డిసైడ్ అయినట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా నిర్మాణం అవుతున్న క్రమంలో ఇప్పటికే స్టోరీ నచ్చడంతో రాసి కన్నా కూడా ఓకే అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి కావడంతో ప్రస్తుతం ఎవరు సినిమాలో నటించాలి అన్నదానిపై డిస్కషన్లు చేసుకుంటూ అశ్వినీదత్ సెలెక్ట్ చేసుకుంటున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!