Mahesh Rajamouli: బాహుబలి 2, RRR రెండు కూడా దాదాపు ₹1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించడం జరిగింది. రెండు కూడా భారతదేశ చలనచిత్ర రంగంలో మైలురాయి చిత్రాలుగా నిలిచిపోయాయి. అంతేకాదు ప్రపంచ స్థాయిలో ఈ రెండు సినిమాలు ఎన్టీఆర్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయి కూడా పెంచడం జరిగింది. ఇక దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా టాలీవుడ్ పేరు మారు మ్రోగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు RRR తర్వాత నెక్స్ట్ సినిమా మహేష్ బాబు తో రాజమౌళి చేయనున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పనులు జరుగుతున్నాయి. రాజమౌళి ఇప్పటివరకు తాను తీసిన అన్ని సినిమాల్లో కంటే హై బడ్జెట్ సినిమాగా… ఇది తెరకెక్కుతోంది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమాలో అదిరిపోయాయి యాక్షన్ సీన్ రాజమౌళి ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే ఈ సినిమాలో నరారూప రాక్షసులతో ఒక ఫైట్ రాజమౌళి ప్లాన్ చేయడం జరిగిందట. ఆఫ్రికా అడవుల్లో పచ్చి మాంసం తినే మనుషులతో ఈ క్రేజీ ఫైట్ ఉండనున్నట్లు సమాచారం. ఇందుకోసం హాలీవుడ్ స్టంట్ టీం రానున్నట్టు వార్తలు వస్తున్నాయి.
యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో …ఈ ఫైట్ హైలైట్ అయ్యేలా జక్కన్న ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు అవుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. “SSMB 28” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 28వ తారీకు విడుదల కానుంది. ఈ సినిమా అయిన వెంటనే రాజమౌళి సినిమాని మహేష్ స్టార్ట్ చేయనున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!