సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు చేయటంలో చాలా స్లోగా ఉన్నారు. తమిళనాడు రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయాలని రాజకీయాల్లో రావాలని రజనీకాంత్ రెడీ అవ్వగా చివరి నిమిషంలో క్యాన్సల్ అవ్వటం తెలిసిందే. ఆ తర్వాత అనారోగ్యానికి గురైన రజనీకాంత్ అమెరికాలో చికిత్స చేయించుకుని మళ్ళీ ఇండియా చేరుకోవడం జరిగింది. అయితే సినిమా షూటింగ్ ల పరంగా గత కొంతకాలంగా.. ఏమీ చేయకుండానే ఇంటిలో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు.
కానీ తాజాగా మాత్రం తన 169 వ సినిమా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అయ్యారు. ఇందుకోసం రజినీకాంత్ త్వరలో హైదరాబాద్ రానున్నారంట. ఈ సినిమాకి సంబంధించి మేజర్ షూటింగ్ పార్ట్ రామోజీ ఫిలిం సిటీలో జరగనుందట. అందుకోసం ఇప్పటికే భారీ సెట్ లు వేయడం జరిగిందంట. సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి జరగనుంది అంట. రజనీకాంత్ చాలా వరకు సినిమా షూటింగ్ ల విషయంలో హైదరాబాద్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. తన లాస్ట్ సినిమా పెద్దన్న షూటింగ్ కూడా హైదరాబాదులోనే జరిగింది.
ఇప్పుడు చేయబోయే కొత్త సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ మొత్తం హైదరాబాద్ లోనే కంప్లీట్ చేయడానికి రజిని డిసైడ్ అయినట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో చాలావరకు తమిళ ఇండస్ట్రీ హీరోలు విదేశాలకు వెళ్లకుండానే హైదరాబాద్ లో తమ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. రజనీకాంత్ తరహాలోనే తమిళ హీరో అజిత్ కూడా ఇటీవల ఎక్కువ భాగం తన సినిమాలకు సంబంధించి షూటింగ్ హైదరాబాదులోనే చేయడం జరిగింది. వరుస పరాజయాల్లో ఉన్న రజిని.. నెల్సన్ దిలీప్ కుమార్ గట్టేక్కిస్తాడో లేదో.. అన్న టెన్షన్ లో రజనీ ఫ్యాన్స్ ఉన్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!