బొప్పాయి పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ఈ పండును తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.బొప్పాయి పండు తింటే కాలెయం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే డెంగ్యూ జ్వరం వచ్చినవారు బొప్పాయి పండును తింటే ప్లేట్లెట్స్ వృద్ధి చెందుతాయి.అంతేకాకుండా ఆడవాళ్లలో వచ్చే రుతుస్రావ సమస్యలు కూడా తగ్గిపోతాయి.బొప్పాయిలో ఉండే విటమిన్ ఏ వలన అన్ని రకాల జబ్బులు నియంత్రించబడతాయి. అయితే కొంతమంది మాత్రం ఈ బొప్పాయి పండును తినకూడదు.ఒకవేళ తింటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి బొప్పాయి పండును ఎవరెవరు తినకూడదో అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భిణీ స్త్రీలు:
బొప్పాయి పండును గర్బిణి స్త్రీలు అస్సలు తినకూడదు. ఎందుకంటే దీనిలో ఉండే లేటెక్స్, పపైన్ అని పిలువబడే మూలకాలు గర్భాశయాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అలాగే బొప్పాయి పండును తినడం వలన శరీరంలో వేడి అధికం అవుతుంది. ఫలితంగా గర్భశ్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బొప్పాయి పండును గర్భిణులు అస్సలు తినకూడదు.
గుండె జబ్బులు ఉన్నవారు :
గుండె జబ్బులతో బాధపడేవారు కూడా బొప్పాయి పండును తినకపోవడమే మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బొప్పాయిలో ఉండే వివిధ మూలకాలు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది కావున హార్ట్ పేషంట్స్ బొప్పాయి పండు జోలికి వెళ్లకూడదు.
కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు :
కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు కూడా బొప్పాయి పండును తినకూడదు. ఎందుకంటే బొప్పాయి పండులో విటమిన్ ‘సి’ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్ళ శరీరానికి హానిచేస్తుంది. అలాగే బొప్పాయి పండులో కాల్షియం ఆక్సలేట్ అధికంగా ఉండటం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కాబట్టి బొప్పాయికి దూరంగా ఉండండి.
రక్తంలో చెక్కర స్థాయి తక్కువ ఉన్నవాళ్లు :
రక్తంలో చెక్కర స్థాయి తక్కువ ఉన్నవారు కూడా బొప్పాయి పండును అస్సలు తినకూడదు. బొప్పాయిలో ఉండే పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. కాబట్టి హైపోగ్లైసీమియా ఉన్నవారు మాత్రం ఈ పండును తినకుండే ఉంటే మంచిది.