Rashi Khanna: రాశీ ఖన్నా.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `మనం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేత్ చేసుకుంది. కెరీర్ స్టార్టింగ్లో కాస్త బొద్దుగా ఉన్నా.. ఈ మధ్య బక్కచిక్కిన రాశీ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశీ ఖన్నా వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలనూ షేర్ చేసుకుంది. అలాగే ఈ సందర్భంగా సినిమాల్లోకి రాకముందు తాను ఏం అవ్వాలనుకుందో కూడా తెలిపింది. రాశీ ఖన్నా మాట్లాడుతూ.. `నేను ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్లో చదివాను. సినిమాల్లోకి రాకముందు కాపీ రైటర్ కావాలనుకున్నాను.
డిగ్రీ కాగానే దానికి సంబంధించిన కోర్సు కూడా చేద్దామనుకున్నా. అంతలోనే ‘మద్రాస్ కేఫ్’లో అవకాశం వచ్చింది. అనంతరం అవసరాల శ్రీనివాస్ ‘ఊహలు గుసగుసలాడే’ స్క్రిప్ట్తో నన్ను సంప్రదించగా.. కాదనలేకపోయాను. ఆ తర్వాత నా జర్నీ గురించి అందరికీ తెలిసిందే` అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి రాశీ ఒకటనుకుంటే.. మరొకటి అయిందన్నమాట.
కాగా, రాశీ ఖన్నా సినిమాల విషయానికి వస్తే.. ఈమె తెలుగుతో నాగ చైతన్య సరసన `థ్యాంక్యూ`, గోపీచంద్ కు జోడీగా `పక్కా కమర్షియల్` చిత్రాలు చేయగా.. ఇవి విడుదలకు సిద్ధంగా ఉంటాయి. అలాగే తమిళంలో నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన రాశీ.. బాలీవుడ్లో సిద్ధార్థ్ మల్హోత్రాతో `యోధ`, షాహిద్ కపూర్తో ఓ సినిమా చేస్తోంది. మరోవైపు రాజ్ అండ్ డీకే డైరక్ట్ చేస్తున్న వెబ్సీరీస్కి కూడా రాశీ సైన్ చేసింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!