Rashmika Mandanna: నెషనల్ క్రష్, కుర్రాళ్ళ కలల రాకుమారి రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. కన్నడ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన రష్మిక.. ఛలో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతోనే హిట్ అందుకుని వరుస అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ను దక్కించుకుని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది.
ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్న రష్మిక.. ఇటీవల `పుష్ప ది రైస్` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం డిసెంబర్ 17న గ్రాండ్గా విడుదల అయింది. టాక్ ఎలా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ మూవీలో `సామీ సామీ..` సూపర్ పాపులర్ అయింది. ఈ సాంగ్కు చాలా మంది స్టెప్పులు వేస్తుండగా.. రష్మిక జిమ్ ట్రైనర్ కుల్దీప్ సేతీ కూడా డ్యాన్స్ చేసి అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.
ఈ వీడియోపై స్పందించిన రష్మిక.. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది. `నన్ను జిమ్ లో కుల్దీప్ చాలా టార్చర్ పెట్టాడు. చేసిన వర్కౌట్ మళ్లీ మళ్లీ చేయిస్తూ ఇబ్బంది పెట్టేవాడు. అయితే ఇలా సామి సామి సాంగ్కు స్టెప్పులు వేస్తాడని తెలిస్తే దగ్గరుండి నేనే ఆ స్టెప్పులు నేర్పిస్తూ మళ్ళీ మళ్ళీ చేయమని రివేంజ్ తీసుకునేదాన్ని. మిస్ అయ్యాను` అంటూ సరదాగా ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో రష్మిక పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారింది. కాగా, రష్మిక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్ సరసన `పుష్ప 2`, శర్వానంద్కు జోడీగా `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాలు చేస్తోంది. అలాగే మరోవైపు హిందీ, కన్నడ భాషల్లోనూ పలు సినిమాలకు సైన్ చేసింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!