Radhe shyam – RRR: ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అంటే రెండే రెండు..ఒకటి ఆర్ఆర్ఆర్ పోస్ట్పోన్..ఒకటి రాధే శ్యామ్ రిలీజ్ విషయం. సంక్రాంతి బరిలో అన్ని సినిమాలను పోస్ట్పోన్ చేసుకొని ఈ రెండు సినిమాలే బెర్తులు కన్ఫర్మ్ చేసుకున్నాయి. రెండు పాన్ ఇండియన్ సినిమాలు. ఒక సినిమా బడ్జెట్ దాదాపు 500 కోట్లు..ఒక సినిమా బడ్జెట్ దాదాపు 300 కోట్లు. అందుకే పవన్ కళ్యాణ్ – రానాల మల్టీస్టారర్ భీమ్లా నాయక్, మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమాలు పోస్ట్ పోన్ చేయించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాను జనవరి 7న ఏకంగా 14 భాషలలో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేశారు.
దాదాపు 20 కోట్లు పెట్టి నెలరోజులుగా ముంబై, చెన్నై, బెంగుళూరులలో భారీ స్థాయిలో రాజమౌళి, హీరోలు ఎన్.టి.ఆర్, రాం చరణ్, మిగతా తారాగణం కలిసి ప్రమోషన్స్ నిర్వహించారు. ఇక ఆరు రోజుల్లో సినిమా రిలీజ్ అనగా అనూహ్యంగా కరోనా కొత్త వేరియంట్ కారణంగా పోస్ట్పోన్ చేస్తూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో కూడా వెల్లడించారు. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న దాని ప్రకారం వచ్చే దసరాకు గాని రిలీజ్ చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాత టెన్షన్తో నిద్రపట్టక ఇబ్బందులు పడుతున్నాడని ఫిలిం సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది.
Radhe shyam – RRR: పోస్ట్ పోన్ అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమా పోస్ట్పోన్ అవడంతో ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రానికి సోలో డేట్ దొరికిందని కొంతమంది భావిస్తున్నారు. కానీ చకచకా చిన్న సినిమాలతో పాటు నాగార్జున బంగార్రాజు కూడా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమానే పోస్ట్ పోన్ చేసినప్పుడు రాధే శ్యామ్ రిలీజ్ చేయడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని అందరూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మరిన్ని సినిమాలు పోటీ అంటే రాధే శ్యామ్ ఏమాత్రం తేడా కొట్టిన గట్టి ప్రభావం పడి భారీ స్థాయిలో నష్టాలు తప్పవని చెప్పుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయితే మరే సినిమా బరిలో దిగేది కాదు. కానీ, ఇప్పుడు అంతా తారుమారై ప్రభాస్కు టార్గెట్లా అయింది. దాదాపు పోస్ట్ పోన్ అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!