యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం `సాహో`. ఆగస్ట్ 30న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ను పొందింది. సినిమా వ్యవథి 171.52 నిమిషాలు. అంటే దాదాపు మూడు గంటల వ్యవథితో సాగే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. బాలీవుడ్ నటి శ్రద్దాకపూర్ హీరోయిన్గా నటించగా.. జాకీష్రాఫ్, మందిరాబేడి, చుంకీ పాండే, నీల్ నితిన్, మురళీశర్మ తదితర బాలీవుడ్ తారలు ప్రధాన పాత్రల్లో నటించారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు సినిమా కోసం పనిచేశారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో ఇక `సాహో` రిలీజ్కు రూట్స్ అన్నీ క్లియర్ అయినట్లే. భారీ అంచనాల నడుమ విడుదలవుతోన్న ఈ చిత్రం విడుదల తర్వాత ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!