‘బాహుబలి చిత్రం తరువాత ప్రపంచ సినిమా బాక్సాఫీస్ ఒక్కసారిగా యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ నటిస్తున్న `సాహో` చిత్రం వైపుకి మళ్ళిన విషయం తెలిసిందే.. ఇండియాలో మెట్టమెదటిగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ చిత్రం అగష్టు 15 న భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు నిర్మాతలు సన్నాహలు చేశారు. `బాహుబలి`లాంటి చిత్రం తరువాత వస్తున్న చిత్రం కావటం తో రెబల్స్టార్ ఫ్యాన్స్తోపాటు ఇండియన్ సినిమా లవర్స్ అందరూ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీంతో మేకర్స్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఆడియన్స్కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటీతో అందించాలని నిర్ణయించుకున్నారు. హైస్టాండర్డ్ వి ఎఫ్ ఎక్స్ ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఎక్కడా హడావుడి కాకుండా ఈ చిత్రానికి సంబందించిన వర్క్ జరుగుతుంది. అందుకే ఇండిపెండెన్స్ డే లాంటి మంచి డేట్ని కూడా మేకర్స్ వదులుకుని అగష్టు 30న ఈ చిత్రాన్ని అందింస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్రమ్ మాట్లాడుతూ.. “మా బ్యానర్లో వచ్చిన అన్ని చిత్రాలు క్వాలిటీకి కేరాఫ్ గా వచ్చాయి. మరి ఇప్పుడు యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా `సాహో` లాంటి చిత్రాన్ని చేస్తున్నాం. అది కూడా `బాహుబలి` అనే ల్యాండ్ మార్క్ చిత్రం తరువాత వస్తున్న చిత్రం కావటం సినిమా ప్రేక్షకులందరూ అంచనాలు అందుకోవాలి అందుకే చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇంత లార్జ్ స్కేల్లో వస్తున్న చిత్రాన్ని ప్రేక్షకులకి బెస్ట్గా ఇవ్వాలనే మా ప్రయత్నం. కాబట్టి అగష్థు 30న ఈ చిత్రాన్ని ప్రపంచం లో వున్న సినిమా లవర్స్కి అదిస్తున్నాం“ అన్నారు.
యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్రమ్ అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రెబల్స్టార్ ప్రభాస్, శ్రధ్ధాకపూర్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకీ పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేకర్, టిను ఆనంద్, శరత్ లోహితష్వా తదితరులు నటిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!