పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న “సలార్” కి సంబంధించి బిగ్ అప్ డేట్ సినిమా యూనిట్ ప్రకటించేసింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 12:58 నిమిషాలకు పోస్టర్ తో కూడిన రిలీజ్ డేట్ ప్రకటించడం జరిగింది. వచ్చే ఏడాది 2023 సెప్టెంబర్ 28వ తారీకు నాడు సినిమా రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం అధికారికంగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత హై బడ్జెట్ 500 కోట్ల రూపాయలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్. “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
“కేజిఎఫ్” రెండు భాగాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అనేక రికార్డులు సృష్టించటం తెలిసిందే. ముఖ్యంగా రెండో భాగంతో ఏకంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం జరిగింది. దీంతో ఇప్పుడు “సలార్” పై అందరి దృష్టి పడింది. వాస్తవానికి ఈ సినిమా ప్రారంభించిన టైములో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారిక ప్రకటన ప్రారంభంలో చేసింది.
కానీ మహమ్మారి కరోనా వైరస్ సృష్టించిన విధ్వంసానికి అనేక వాయిదాలు పడుతూ ఇప్పుడు ఏకంగా వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో “సలార్” విడుదలవుతున్నట్లు ప్రకటించడం అభిమానులకు ఎంతో నిరురోత్సాహాన్ని కలిగించింది. ఏకంగా ఏడాదికి పైగానే టైం పడుతున్న క్రమంలో తాజా రిలీజ్ డేట్ విన్నాక డార్లింగ్ ఫాన్స్ నిరుత్సాహపడ్డారు. అందరూ వచ్చే ఏడాది సమ్మర్ లో “సలార్” రిలీజ్ అవుతుందని భావించారు. ఇప్పుడు వచ్చే ఏడాది సెప్టెంబర్ అని సినిమా యూనిట్ ప్రకటించడం అందరికీ షాక్ ఇచ్చినట్లు అయింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!