మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అందుకే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా పోషకాలున్న పండ్లను ఆహారంగా తీసుకుంటున్నారు. పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదే కానీ వాటిలో ఉండే గింజల వలన అనారోగ్య సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.మరి ఆ గింజలు ఏంటి.. అవి తింటే ఎలాంటి అనారోగ్యాలు వస్తాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, మెలోన్ సీడ్స్ను అతిగా తీసుకోవద్దు.
యాపిల్ పండ్లు:
యాపిల్ పండ్లు అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు.ప్రతి ఒక్కరూ కూడా ఆపిల్ పండు తినడానికి బాగా మక్కువ చూపిస్తారు. ఆపిల్ పండు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చాలా మంది ఆపిల్ పండ్లను తినే క్రమంలో వాటిలో ఉండే గింజలను కూడా తింటుంటారు. కానీ ఆపిల్ పండులో ఉండే గింజలను తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. యాపిల్ గింజల్లో సైనైడ్ ఉంటుంది. వీటిని అతిగా తింటే.. కడుపు తిమ్మిరి, వికారం, విరేచనాలు కలగవచ్చు.
పియర్ :
పియర్ పండులో ఉండే గింజలు కూడా ఆపిల్ గింజల్లా ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.వీటిని తినడం వల్ల కడుపు నొప్పి, వికారం, విరేచనాలు అయ్యే అవకాశాలున్నాయి. వీటిని ఎక్కువ మోతాదులో తినడం వల్ల విపరీతమైన చెమటలు పట్టడం,అలసట వస్తాయి.
చెర్రీ:
చెర్రీ చూడడానికి ఎర్రగా,భలే అందంగా తినడానికి తియ్యగా రుచికరంగా ఉంటాయి అంతేకాకుండా తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటుంది. అయితే వీటిలో ఉండే విత్తనాలలో కూడా సైనైడ్ సమ్మేళనం అధిక పరిమాణంలో ఉంటుంది కాబట్టి చెర్రీ పండు గింజలు తినకూడదు.
నేరేడు పండు:
నేరేడు పండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వీటిల్లో ఉండే గింజలు ఆరోగ్యానికి విషం వంటివి.. ఈ విత్తనాలలో సైనోజెనిక్ గ్లైకోసైడ్స్, అమిగ్డాలన్స్ అనే టాక్సిన్స్ ఉంటాయి. వీటిని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల శరీరం బలహీనపడుతుంది.