సందీప్ రెడ్డి వంగా పేరు ఇప్పుడు పాన్ ఇండియా పేరు. ఒకే ఒక్క `అర్జున్ రెడ్డి`తో ఆయన ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆర్టిస్టులందరూ ఆయన `అర్జున్రెడ్డి`ని మెచ్చుకున్నారు. హిందీలోనూ `కబీర్సింగ్`కు ప్రమోషన్లు భారీగా జరిగాయి. తమిళంలోనూ అదే క్రేజ్ ఇప్పటికీ ఉంది. ఇదంతా ఇలా ఉండగా సందీప్ వంగా తదుపరి సినిమా గురించి చర్చ బాగానే నడించింది ఒకానొక సమయంలో సందీప్ను ఏకంగా మహేష్బాబు కలవడంతో ఆయనతో సినిమా ఉందని అందరూ ఫిక్సయ్యారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే సందీప్ వంగాకు మహేష్ ఏడాది దాకా దొరికే పరిస్థితి లేదు. ఇప్పుడు సందీప్ ఆయన్ని నమ్ముకున్నా అన్నాళ్లూ వేస్ట్ గా ఉండాల్సిందే. అందుకే మహేష్ కథ చెప్పి, ఓకే చెప్పేలోపు తానే విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. `గీత గోవిందం` తర్వాత సాలిడ్ కథ కోసం విజయ్ దేవరకొండ వెయిట్ చేస్తున్నారు. ఆయన నటించిన `డియర్ కామ్రేడ్ ` ఫస్ట్ కాపీ రెడీ అయినప్పటికీ కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయట. ఈ సినిమాను సౌత్ ఇండియాలో భారీగా ప్లాన్ చేయాలన్నది నిర్మాతల సంకల్పం.
previous post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!