శేఖర్ కమ్ముల సినిమా చేస్తున్నారంటే ఆ చిత్రం పూర్తయ్యేవరకు దాదాపు ఎవరికీ బయటకు కూడా తెలియదు. కానీ ఈ సారి అలా కాదు. పెరుగుతున్న ఆయన ఛరిష్మా కారణంగా ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నారు? వంటి విషయాల పట్ల ఆసక్తి కూడా రోజురోజుకూ జనాలకు పెరుగుతోంది. తాజా అప్డేట్ ప్రకారం శేఖర్ కమ్ముల ప్రస్తుత సినిమా 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రంలో తెలుగమ్మాయి డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తున్నారు. బాపు హీరోయిన్లు, రాఘవేంద్రరావు నాయికలు.. అంటూ తెలుగులో కొందరు దర్శకుల హీరోయిన్లకు స్పెషల్ పేరు ఎప్పుడూ ఉంటుంది. ఇటీవలి కాలంలే సుకుమార్ పరిచయం చేసే ఐటమ్ భామలకు ఎంత పేరు ఉందో, శేఖర్ కమ్ముల నాయికలకూ అంత పేరుంది. కమలిని ముఖర్జీ నుంచి మొన్న మొన్నటి సాయి పల్లవి వరకు ఆయన మార్కు కనిపిస్తూనే ఉంది. తాజాగా ఆయన చిత్రంలో డింపుల్ హయతికి కూడా అంతే పేరు రానుంది. డింపుల్కి ఇది తొలి సినిమా కాదు. ఆమె ఇదివరకే గల్ప్ లో చేసింది. ప్రభుదేవా నటిస్తున్న అభినేత్రి సీక్వెల్ అభినేత్రి2లోనూ నటిస్తోంది.
సో టాలెంట్ ఉండాలేగానీ తెలుగమ్మాయిలకూ మంచి ఫ్యూచర్ ఉంటుందని డింపుల్ మరోసారి నిరూపించింది. అగ్ర కథానాయికల సరసన డింపుల్ చేరాలని ఆశిద్దాం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!