యువ హీరో సాయితేజ్ ఇద్దరు స్టార్ హీరోలతో పోటీకి సై అంటున్నాడు. వివరాల్లోకెళ్తే.. సాయితేజ్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ప్రతిరోజూ పండగే`. ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పటికే అదే రోజున నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం.. రవితేజ చిత్రం `డిస్కోరాజా` కూడా అదేరోజున విడుదల కానున్నాయి. క్రిస్మస్ రోజున మూడు సినిమాలు పోటీ పడనున్నాయి. ఈ ఇద్దరు మాస్ హీరోల సినిమా నడుమ వస్తున్న ఫ్యామిలీ చిత్రం `ప్రతిరోజూ పండగే` ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
previous post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!