Sarkaru Vaari Paata: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్కి తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్ తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు `సర్కారు వారి పాట` సినిమా చేసి సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించగా.. తమన్ స్వరాలు అందించారు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించారు.
ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రంలో సముద్రఖని విలన్గా చేయగా.. వెన్నెల కిశోర్, నదియా, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలను పోషించారు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్ని మరి కొన్ని గంటల్లో రిలీజ్కు సిద్ధంగా ఉంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ నేపథ్యంలో మహేష్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద సందడి షురూ చేశారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఓ గుడ్న్యూస్ తెలిపింది. ఇప్పటికే నైజాం ఏరియా లో ఈ సినిమా కి టికెట్ల ధరల హైక్ తో పాటుగా, అదనపు షో కి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా నైజాంలో సర్కారు వారి పాట చిత్ర రైట్ హోల్డర్స్ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ వారి రిక్వెస్ట్ మేరకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది.
ఈనెల 12 నుంచి 18 వరకు వారం రోజుల పాటు ప్రతి రోజూ ఐదు షోలకు అనుమతి ఇచ్చింది. అంతేకాదండోయ్.. మొదటి రోజు 4:05 గంటల స్పెషల్ మార్నింగ్ షో కి సైతం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే నాలుగు థియేటర్స్లోనే స్పెషల్ షో ప్రదర్శించేందుకు అనుమతులు జారీ చేసింది. భ్రమరాంబ ధియేటర్ కూకట్ పల్లి, మల్లికార్జున థియేటర్ కూకట్ పల్లి, విశ్వనాథ్ థియేటర్ కూకట్ పల్లి, శ్రీ రాములు థియేటర్ మూసాపేట్ లో సర్కారు వారి పాట బెనిఫిట్ షో విడుదల కానుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!