Tollywood: 2019 సంవత్సరంలో సమ్మర్ నుండి ఆ తరువాత ఏడాది మరియు గత ఏడాది ఏటువంటి సినిమాలు రిలీజ్ కాని పరిస్థితి. మహమ్మారి కరోనా కారణంగా వేసవి మార్కెట్ మూడు సంవత్సరాలు దెబ్బతింది. దీంతో వేసవి కానుకగా రిలీజ్ కావాల్సిన సినిమాలు .. వాయిదా పడుతూ వచ్చాయి. ఈ ఏడాది కూడా ఒమిక్రన్ దెబ్బకి వేసవిలో సినిమాలు విడుదల చేయలేని పరిస్థితి అని ముందు భావించారు. కానీ కేసులు ప్రారంభం మూడవ వారంలో ఒక్క సారిగా పెరగటం ఇప్పుడు పూర్తిగా తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపిస్తూ ఉండటంతో… ప్రభుత్వాలు కూడా… ఆంక్షలు ఎత్తివేస్తుండటంతో సమ్మర్ కానుకగా.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దాదాపు 2 వేల కోట్ల బిజినెస్ స్టార్ట్ కానుంది అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
కరోనా తగ్గుముఖం పట్టడంతో పెద్ద సినిమాలు… విడుదల అవటానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగాయి. సంక్రాంతికి రావాల్సిన పాన్ ఇండియా సినిమాలు RRR, రాధేశ్యాం.. వేసవి కానుకగా రిలీజ్ కానున్నాయి. ఇవి కాకుండానే పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్”, మహేష్ సర్కార్ వారి పాట… ఇంకా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నయి. అయితే ఈ క్రమంలో దాదాపు సగం వాటా RRR సినిమా దే. బాహుబలి 2 క్రియేట్ చేసిన రికార్డుల… నేపథ్యంలో RRR ప్రీ రిలీజ్ బిజినెస్ 900 కోట్లకు చేరింది.
ఇక ప్రభాస్ రాధేశ్యామ్ ప్రీ బిజినెస్ 350 కోట్లు కలెక్ట్ చేసినట్లు.. వార్తలు వస్తున్నాయి. వేసవి కానుకగా మొత్తం రిలీజ్ అవుతున్న సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 1800 కోట్ల అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో విడుదలైన సినిమాలు సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటే… మొత్తం రెండు వేల కోట్లకు పైగా బిజినెస్ సమ్మర్ వేదికగా టాలీవుడ్ బాక్సాఫీస్ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కొరటాల దర్శకత్వంలో “ఆచార్య” సినిమా కూడా భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం జరిగింది. మొత్తంమీద చూసుకుంటే దాదాపు ఈ ఏడాది సమ్మర్… బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన వార్ పెద్ద సినిమాల నడుమ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!